కరోనా వారిని వీరిని అనే తేడా లేకుండా ఏ ఒక్కరిని వదలకుండా వాయించేస్తోంది. దేశ అధ్యక్షుడి నుండి అడుక్కు తినే వాడి వరకు కరోనా బారిన పడటం మనం చూస్తూనే ఉన్నాం. ఇండియాలో గత నెల రోజులుగా ప్రముఖులు ఎక్కువగా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవుతోంది. ఈ విషయంలో వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఎవరిని కలవకుండా ఉంటున్నా కూడా కరోనా అనేది వారికి వస్తూనే ఉంది. అయితే ఎక్కువ మంది సెలబ్రెటీలు క్యూర్ అవుతున్నారు. తాజాగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.
తనకు కరోనా వచ్చిన విషయాన్ని స్వయంగా బాలు గారు సోషల్ మీడియాలో ప్రటించారు. గత కొన్ని రోజులుగా జ్వరం వచ్చి పోతూ ఉండటంతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలు ఉండటంతో అనుమానంతో బాధ్యత యుతంగా కరోనా పరీక్షలు చేయించుకున్నాను. స్వల్ప స్థాయిలో పాజిటివ్ ఉంది అంటూ నిర్థారణ అయ్యింది. ఇంట్లో ఉండవచ్చు అంటూ వైధ్యులు సూచించారు. స్నేహితులు ప్రస్తుతం నన్ను చూసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు అమెరికాలో ఉండటం వల్ల ఎలాంటి సమస్య లేదు.
నా ఆరోగ్యం గురించి ఆందోళన పడుతూ చాలా మంది ఫోన్ చేస్తున్నారు. వారు అంతా కూడా ఆందోళన చెందనక్కర్లేదు. రెండు మూడు రోజుల్లోనే బాగు అవుతుంది. నాకు ఎవరు ఫోన్ చేయకండి అంటూ బాలసుబ్రమణ్యం విజ్ఞప్తి చేశారు. నేను పూర్తి విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటున్నాను. కనుక ఫోన్ చేసి ఇబ్బంది పెట్ట వద్దంటూ ఆయన పేర్కొన్నాడు. బాలు వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆయనకు ఎలాంటి తీవ్ర అనారోగ్య లక్షణాలు లేవు కనుక త్వరలోనే కరోనాను జయించి తిరిగి మామూలు మనిషి అవుతారంటూ అభిమానులు నమ్ముతున్నారు. మా తరపున కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.
#SPBalasubramanyam tested positive for #Coronavirus, and has confirmed it himself.
He is currently admitted to a hospital and is receiving treatment, and has said that there's no need to worry.
We wish him a speedy recovery pic.twitter.com/AoreDYX4Am
— TeluguBulletin.com (@TeluguBulletin) August 5, 2020
194052 765013I like the way you conduct your posts. Have a nice Thursday! 687199