బాలీవుడ్ స్టార్ సింగర్ కనిక కపూర్ గత నెలలో లండన్ వెళ్లి అక్కడ నుండి తనకు తెలియకుండానే కరోనాను మోసుకు వచ్చింది. ఆమె చేసిన హడావుడి ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె పాజిటివ్ అని తేలడంతో రాష్ట్రపతి భవన్ కూడా టెన్షన్కు గురి అయ్యింది. ఆమెతో కాంటాక్ట్ అయిన వారు రాష్ట్రపతి భవన్కు కూడా వెళ్లిన కారణంగా అక్కడ కూడా శానిటైజేషన్ చేయడంతో పాటు రాష్ట్రపతి ఇంకా ఇతర అధికారులకు కూడా పరీక్షలు నిర్వహించారు.
ఇక కనిక ఆరోగ్యం గురించి ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు సార్లు పరీక్ష చేసినా కూడా ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో అంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. రెండు వారాల్లో కరోనా పాజిటివ్ నుండి నెగటివ్కు రావాలి. కాని కనిక మాత్రం కాస్త ఎక్కువ సమయం తీసుకుంది. నాల్గవసారి టెస్టు చేసిన సమయంలో పాజిటివ్ రావడంతో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యింది.
కుటుంబ సభ్యులను మిస్ అవుతున్నట్లుగా ఆమె కన్నీరు పెట్టుకుంది. ఇదే సమయంలో కనిక కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ విదేశాలకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లుగా పేర్కొన్నారు. ఎట్టకేలకు కనిక కపూర్ కరోనా నెగటివ్ వచ్చింది. అయిదవ సారి టెస్టు నిర్వహించగా నిన్న సాయంత్రం ఆమె కరోనా నెగటివ్ రిపోర్ట్ వచ్చిందని తెలుస్తోంది. మరో వారం రోజులు ఆమెను హాస్పిటల్లోనే ఉంచి ఆ తర్వాత ఆమెకు మరోసారి పరీక్షలు నిర్వహించి తగిన జాగ్రత్తలతో ఆమెను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.