ఆర్ ఎక్స్ 100 చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఆ చిత్రంలో హీరోగా నటించిన కార్తికేయ ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు చేసి మరో రెండు మూడు సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఇక హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుసగా ఆమె సినిమాలు చేస్తూనే పోతుంది. కాని దర్శకుడు అజయ్ భూపతి మాత్రం ఇప్పటి వరకు తదుపరి చిత్రంను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేదు.
అజయ్ భూపతి రెండవ సినిమాను భారీ మల్టీస్టారర్గా ప్లాన్ చేశాడు. పలువురు హీరోలను సంప్రదించిన దర్శకుడు అజయ్ భూపతి అన్ని విధాలుగా నిరాశ పడ్డాడు. చివరకు ఆ మల్టీస్టారర్ మహాసముద్రంను శర్వానంద్తో చేసేందుకు సిద్దం అయ్యాడు. మరో హీరో పాత్ర కోసం చాలా మందిని సంప్రదించి చివరకు సిద్దార్థను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
శర్వానంద్కు ఈ మద్య కాలంలో ఏమాత్రం టైం సరిగా ఉండటం లేదు. ఎంతో అంచనాలు పెట్టుకున్న జాను చిత్రం కూడా తీవ్రంగా నిరాశ పర్చింది. ఆ సినిమా తర్వాత శ్రీకారం చిత్రాన్ని చేస్తున్న శర్వానంద్ ఆ సినిమాపై అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదే సమయంలో మహాసముద్రం సినిమా కథతో అజయ్ భూపతి ఒప్పించాడు. హీరో సిద్దార్థ కూడా ఈ సినిమాలో ఒక హీరోగా నటించబోతున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ విపత్కర పరిస్థితులు కాస్త సర్దుమనిగిన తర్వాత షూటింగ్కు వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు.
716197 304282Some really nice stuff on this internet website , I adore it. 176295
593857 927268Completely pent subject matter, appreciate it for selective info . 993281
612378 245838I saw two other comparable posts although yours was the most beneficial so a lot 461483
704866 153650woah i like yur internet site. It actually helped me with the info i wus looking for. thank you, will save. 919837