మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించగా, ఊరమాస్ అవతారంలో మెగాస్టార్ ఈ సినిమాలో రఫ్ఫాడించాడు.
అయితే ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమ్మడి పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే శ్రుతి హాసన్ ఇప్పుడు మెగా హీరోలకు లక్కీ గర్ల్గా మారింది. గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస ఫెయిల్యూర్స్తో సతమతమవుతున్నప్పుడు గబ్బర్సింగ్ సినిమాలో పవన్ సరసన శ్రుతి నటించింది. ఆ సినిమా పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి కూడా శ్రుతి లక్కీ గర్ల్గా మారింది. చిరు నటించిన రీసెంట్ మూవీలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ వాల్తేరు వీరయ్య రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే వంద కోట్ల వసూళ్లతో దుమ్ములేపింది. ఇలా వరుసగా మెగా హీరోలకు బౌన్స్ బ్యాక్ అయ్యే సినిమాల్లో శ్రుతి నటిస్తుండటంతో ఆమె వారికి లక్కీ గర్ల్గా మారిందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.
765619 74058Glad to be one of several visitants on this awful internet internet site : D. 248037
327790 800045Respect to author , some great data . 420171
951759 525529Thank you for your very very good details and respond to you. san jose car dealers 766201