లేటెస్ట్ గా ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ శ్రద్ధ కపూర్ కు లేటెస్ట్ గా ఓ బంపర్ అఫర్ దక్కింది. అదేమిటంటే .. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కే రామాయణం సినిమాలో సీత పాత్ర కోసం ఆమెను అడిగారట. ఇప్పటికే బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు లేటెస్ట్ గా సాహో సినిమాతో పాటు ఛిచ్చోర్ సినిమాలో నటించింది. ఈ సినిమాల తరువాత శ్రద్ధ కపూర్ కు ఒకేసారి రెండు సినిమాల ఆఫర్స్ వచ్చాయి.
వరుణ్ ధావన్ తో స్ట్రీట్ డాన్సర్ 3డి, భాగీ 3 సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. అయితే ఈ అమ్మడు రణబీర్ కపూర్, అజయ్ దేవగన్ ల లవ్ రంజాన్ సినిమాను ఎంచుకుంది. తాజాగా అత్యధిక బడ్జెట్ తో అంటే 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న రామాయణం సినిమాలో సీత పాత్రకోసం శ్రద్ధ ను అడిగారట. ఇంతకుముందే ఈ పాత్రకోసం హాట్ భామ దీపికాను అడిగారట.
ఒక్కసారిగా ఈ రేంజ్ లో ఊహించని అఫర్ రావడంతో శ్రద్ధ కపూర్ ఎగిరి గంతేసింది. హృతిక్ రోషన్ శ్రీరాముడిగా కనిపిస్తాడని టాక్. అన్నట్టు ఈ సినిమాలో రావణాసురుడి పాత్రకోసం ప్రభాస్ ని అడుగుతున్నట్టు తెలిసింది. ఈ సినిమాకు నితేశ్ దర్శకత్వం వహిస్తాడట. ఇదివరకే శ్రద్ధ కపూర్ తో ఓ సినిమా చేసిన ఈ దర్శకుడితో ఈ అమ్మడు మంచి రాపో మైంటైన్ చేస్తుందట. అందుకే ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ కి అఫర్ వచ్చిందన్న టాక్ వినిపిస్తుంది.
