ఓపక్క ఏపీలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంటే.. మరోపక్క సమాచార శాఖ ఫోన్లు కనెక్షన్లు కట్ చేసి సర్వీస్ ప్రొవైడర్లు ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సమాచార శాఖ ఫోన్లు పని చేయడం మానేసాయి. సెల్ఫోన్ బిల్లులు చెల్లించకపోవడంతో సర్వీస్ నిలిపివేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న ఈ అత్యవసర సమయంలో ఫోన్లు పని చేయకపోవడంతో విధుల్లో ఉన్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశమైంది. కౌంటింగ్ సందర్భంగా ఐ అండ్ పీఆర్ డిపార్ట్ మెంట్ అధికారులు, ఉద్యోగులు తమ ఫోన్ నెంబర్లను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. అధికారిక సమాచారం కోసం ఇచ్చిన ఈ నెంబర్లు పని చేయకపోవడం కలవరపెడుతోంది.