షర్మిల రేంజ్ పెరుగుతోంది.! జగన్ రేంజ్ పతనమవుతోంది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,470FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లో ఓడలు బళ్ళవడం.. బళ్ళు ఓడలవడం.. తెలిసిన విషయాలే.! మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష హోదా కోసం కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది.

అయినా, రాష్ట్రంలో వుండని జగన్ ఎలా ప్రతిపక్ష నేత హోదాకి అర్హుడన్న చర్చ జరుగుతోంది. జగన్ కంటే షర్మిల బెటర్, ఏపీసీసీ అధ్యక్షురాలిగా ప్రజా సమస్యలపై నినదిస్తోంది, ప్రెస్ మీట్లలో మీడియా సంధించే ప్రశ్నలకూ సమాధానమిస్తోందని వైసీపీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతుండడం గమనార్హం.

వైఎస్ జగన్ వీకెండ్ రాజకీయాలే చేస్తున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లికి వస్తున్నారు, మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు.! ఇలాగైతే ఎలా.? కూటమి దయతలచి వదిలేసిందిగానీ, లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీకి ఘోర పరాజయం తప్పేది కాదు.!

బొత్స ఎటూ బీజేపీలోకి దూకేస్తారు గనుక, పదవితో దూకితే ఆయనకీ గౌరవం.. అన్న కోణంలో బీజేపీ సూచన మేరకు, టీడీపీ ‘ఎమ్మెల్సీ ఎన్నిక’ని లైట్ తీసుకుందన్న గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ఎన్నిక కోసమే కొన్ని రోజులపాటు ఏపీలో వున్నారు వైఎస్ జగన్. పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిథులతో చర్చించారు.. నానా హైరానా పడ్డారు. చివరికి ఎన్నికతో పని లేకుండానే బొత్స, ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అయిపోయారు.

ఈ మొత్తం వ్యవహారంలో జగన్ వృధా ప్రయాస నవ్వులపాలవుతోంది. మరోపక్క, జగన్ కంటే షర్మిల బెటర్.. అని ఎమ్మెల్సీ ఎన్నిక వేళ చర్చ జరుగుతోంది. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గనుక, కాంగ్రెస్ అధినాయకత్వాన్ని మెప్పించి రాజ్యసభ పదవో, ఇంకో పదవో సంపాదించగలిగితే, ఏపీ రాజకీయాల్లో జగన్ కంటే షర్మిల కటౌట్ చాలా పెద్దదవుతుందనేవారూ లేకపోలేదు.
ఎందుకీ పరిస్థితి.? అంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని షర్మిల విమర్శిస్తే.. షర్మిలకి జరిగే డ్యామేజ్ కంటే, షర్మిలను వైసీపీ విమర్శిస్తే, జగన్ మోహన్ రెడ్డికి జరిగే డ్యామేజ్ ఎక్కువవుతోంది మరి. సార్వత్రిక ఎన్నికల వేళ, షర్మిల ఇమేజ్‌ని వైసీపీ అలాగే పెంచింది, జగన్ ఇమేజ్‌ని అలాగే తగ్గించింది కూడా.!

షర్మిలని లైట్ తీసుకోకుండా, ఆమెని వైసీపీ ట్రోల్ చేయడం.. వైసీపీ పతనానికి, జగన్ పతనానికీ కారణమన్న చర్చ అంతటా జరుగుతోంది. షర్మిలను జగన్ ప్రసన్నం చేసుకుంటే తప్ప, వైసీపీకి మనుగడ వుండదనే స్థాయికి పరిస్థితులు మారిపోయాయ్.

బొత్సకి ఇచ్చిన ఆ ఎమ్మెల్సీ పదవి ఏదో షర్మిలకు జగన్ ఆఫర్ చేసి వుంటే బావుండేదన్నది వైసీపీలోనే అంతర్గతంగా జరుగుతున్న చర్చ.

758 COMMENTS

సినిమా

‘తిమ్మరాజుపల్లి టివి’ నిర్మాతగా నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది: కిరణ్ అబ్బవరం

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా Thimmarajupalli TV ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో...

“పెద్ది ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలుసా?”

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మే 18న విడుదల...

వివాదంగా మారిన థియేటర్ల “రెంటల్ – పర్సంటేజ్” అంటే ...

తెలంగాణలో నిర్మాతలు – థియేటర్ యజమానుల మధ్య జరుగుతున్న గొడవ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇది నిజంగా సినిమా పరిశ్రమ సమస్యలకు పరిష్కారమా? లేక అసలు...

Jr.Ntr: రూ.100కోట్ల విరాళాల సేకరణకు ప్లాన్..! స్పందించిన జూ.ఎన్టీఆర్ టీమ్

Jr.Ntr: మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానుల సందడి తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో తమతమ పరిధిలో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు....

Urvashi Rautela: కేన్స్ లో మెరిసిన ఊర్వశి రౌతేలా..! ఆమె లుక్...

Urvasi Rautela: బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాల్తేరు వీరయ్య, డాకూ మహారాజ్, బ్లాక్ రోజ్, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్...

రాజకీయం

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఆర్డీటీ ఆసుపత్రి సందర్శనకు విశేష స్పందన

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో ఉన్న ఆర్డీటీ ఆసుపత్రిని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh గురువారం సందర్శించారు. మంత్రి హోదాలో తొలిసారి ఆర్డీటీకి వచ్చిన లోకేష్‌కు...

రేపు సాధక్‌లతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ భేటీ

జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, సభ్యత్వ నమోదులో చురుకుగా పనిచేసిన సాధక్‌లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో జరగనున్న...

స్థానిక ఎన్నికలపై జనసేన ఫోకస్.. వార్డుల పునర్విభజనపై కీలక చర్చలు

రానున్న పురపాలక, నగరపాలక సంస్థలు మరియు నగర పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ కార్యాచరణను వేగవంతం చేసింది. వార్డులు, డివిజన్ల పునర్విభజనతో పాటు స్థానిక రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించేందుకు...

ఆంధ్రప్రదేశ్‌లో ‘నా దేశం నా బాధ్యత’.. చంద్రబాబు కొత్త కార్యాచరణకు సిద్ధం

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో “నా దేశం నా బాధ్యత” పేరుతో భారీ ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. వనరుల సంరక్షణ, స్వయం సమృద్ధి లక్ష్యంగా రూపొందిస్తున్న ఈ కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి...

“20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ఎంఎస్ఎంఈ లే బలం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి Nara Lokesh పేర్కొన్నారు....

ఎక్కువ చదివినవి

ట్రెండీ కామెడీతో రాబోతున్న రాజేంద్రప్రసాద్ “పాంచాలి పంచభర్తృక”

తెలుగు ప్రేక్షకులను మరోసారి నవ్వుల ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు నటకిరీటి Rajendra Prasad ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ Panchali Panchabharthrika విడుదలకు సిద్ధమవుతోంది. రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్...

“పెద్ది ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలుసా?”

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మే 18న విడుదల కాబోయే ట్రైలర్ గురించి బయటకు వస్తున్న...

Chiranjeevi: ‘చిరంజీవిగారిని కలిసింది అందుకే..’ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన డైరక్టర్

Chiranjeevi: సినిమాల్లో కొత్తవారిని ప్రోత్సహించడం, నటీనటుల నటనను మెచ్చుకోవడం, టెక్నీషియన్ల ప్రతిభను కొనియాడటం మెగాస్టార్ చిరంజీవికి మొదటి నుంచీ ఉన్న అలవాటు. ఎందరో నటీనటులు, దర్శకులు తమ సినిమా మెగాస్టార్ చూడాలని ఆయన...

ఏపీలో టీవీకే పార్టీ పోటీ చేస్తుందా.? టీవీకేతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందా?

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ నానాటికీ మరింత దిగజారిపోతోంది. గత కొన్నాళ్ళుగా వైసీపీ క్యాడర్ అంతా, తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పట్టించుకోవడం మానేసింది. వైఎస్ జగన్ ప్రస్తుతం విదేశీ...

ఢిల్లీ గర్ల్స్ హాస్టల్‌లో షాకింగ్ ఘటన.. డ్రైనేజ్ నుంచి భారీగా కండోమ్స్ వెలుగులోకి!

ఢిల్లీలోని ఓ ప్రముఖ పీజీ గర్ల్స్ హాస్టల్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హాస్టల్ డ్రైనేజ్ లైన్ అకస్మాత్తుగా పూర్తిగా బ్లాక్ కావడంతో నిర్వాహకులు శానిటేషన్ సిబ్బందిని పిలిపించినట్లు...