గోవాలో జరిగే 53వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ – 2022 లో “శంకరాభరణం” చిత్రం- రీ స్టోర్డ్ ఇండియన్ క్లాసిక్స్ (తిరిగి భద్ర పరచాల్సిన గొప్ప చిత్రం) విభాగంలో ఎంపికయ్యింది.
నేషనల్ ఫిల్మ్ ఆర్చివ్స్ ఆఫ్ ఇండియా వారు మన దేశంలొని గొప్ప చిత్రాలను డిజిటలైజ్ చేసి, భద్రపరిచే కార్యక్రమంలొ భాగంగా తెలుగులో విశేష ఆదరణ పొందిన, కళా తపస్వి కె. విశ్వనాథ్ రూపొందించిన పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ – ఏడిద నాగేశ్వరావు నిర్మించిన “శంకరాభరణం” చిత్రం చోటుచేసుకుంది .
అలా చేసిన చిత్రాల్లో కొన్ని ఈ చిత్రోత్సవంలో ప్రదర్శిస్తున్నారు.. అందులో తెలుగు చిత్రం శంకరాభరణం ఒకటి. ఈ ప్రదర్శనకు ఈ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరౌతారు.