కరోనా వైరస్ నియంత్రణకు ఉన్న ఏకైక ఔషధం లాక్ డౌన్ ఒక్కటే అన్నది నిర్వివాదాంశం. భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటించడం ద్వారా మాత్రమే ఇది రాకుండా చూసుకోవచ్చన్నది వైద్య నిపుణుల నుంచి దేశాదినేతల వరకు చెబుతున్న మాట. ఈ క్రమంలోనే పలు దేశాలు లాక్ డౌన్ విధించుకున్నాయి. ఈ విషయంలో చైనా పక్కాగా వ్యవహరించి కరోనా కేసులు తగ్గించుకుంది.
భారత్ లో లాక్ డౌన్ విధించి ఇప్పటికి ఆరు వారాలు దాటింది. తద్వారా ఏకంగా రూ.20 లక్షల కోట్ల ఆదాయం కోల్పోయింది. కోట్లాది మంది వలస కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. మరి ఇన్ని వ్యయప్రయాసలకోర్చి విధించుకున్న లాక్ డౌన్ వల్ల ఫలితం కనిపిస్తోందా? రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది కదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే మనదేశంలో కేసుల సంఖ్య 50వేలకు చేరుతోంది. అయితే, లాక్ డౌన్ వల్ల భారత్ లో ఫలితం కనిపిస్తోందని చెబుతున్నారు. ఏప్రిల్ 12 నాటికి మనదేశం కేసులు 7వేలు దాటాయి. అప్పటికి లాక్ డౌన్ విధించి, కంటైన్మెంట్లు ఏర్పాటు చేయడంతో ఆ మేరకు కేసులు నమోదయ్యాయి. అదే లాక్ డౌన్ విధించకుండా కేవలం కంటైన్మెంట్ చర్యలు మాత్రమే తీసుకుంటే అప్పటికి దేశంలో దాదాపు లక్షా ఇరవై వేల కేసులు నమోదై ఉండేవని అధ్యయనంలో తేలింది. కేసులు రేటు రోజుకు 28.9 శాతం చొప్పున పెరిగి ఉండేదని అంచనా వేశారు.
ఇక లాక్ డౌన్, కంటైన్మెంట్ రెండూ లేకుంటే రోజుకు 41 శాతం చొప్పున ఏప్రిల్ 15 నాటికి ఏకంగా 8.2 లక్షలకు చేరి ఉండేదని లెక్కగట్టారు. అదే జరిగి ఉంటే పరిస్థితి మరీ ఘోరంగా ఉండేదని చెబుతున్నారు. ఇక కేసులు రెట్టింపు అయ్యే విషయంలో కూడా గణనీయమైన పురోగతి కనిపించింది. లాక్ డౌన్ ముందు కేసులు రెట్టింపు కావడానికి 3.4 రోజులు పట్టగా.. లాక్ డౌన్ తర్వాత అది 11 రోజులకు పెరిగింది. దీనిని బట్టి చూస్తే లాక్ డౌన్ వల్ల మెరుగైన ఫలితాలు ఉన్నట్టేనని పేర్కొంటున్నారు.
413004 465337I genuinely enjoy looking at on this website , it has great content . 244628