Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే గుర్తొచ్చేది డ్యాన్స్, ఫైట్స్, కామెడీ. అయితే.. చిరంజీవి అంటే గుర్తొచ్చేవి మరొక విషయం ఆయన వేసే దోశ. ‘చిరంజీవి దోశ’గా ఆయనకు పేటెంట్ కూడా ఉంది. ఆయనకు అత్యంత సన్నిహితులు, ఆత్మీయులు ఈ దోశను తిన్నవారే. వారిలో రాధికా శరత్ కుమార్ ఒకరు. ఆమె మరోసారి ‘చిరంజీవి దోశ’ను తలచుకున్నారు. ‘చిరంజీవి దోశ వేస్తే “మల్లెపూవు”లా ఉంటుంది. అంత అందంగా ఎవరూ వేయలేరు.. అంత టేస్ట్ కూడా నేనెప్పుడూ చేయలేద’ని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ ప్రస్తావన మార్చి 6న విడుదలవుతున్న ‘సరస్వతి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో వచ్చింది. వరలక్ష్మీ శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్లో అతిధులతో యాంకర్ సుమ చిట్ చాట్ లో భాగంగా పలు దోశల పేర్లు ప్రస్తావించారు. అక్కడే ఉన్న రాధిక.. ‘చిరంజీవి దోశ’ను గుర్తు చేసుకున్నారు. ‘ఓసారి చిరంజీవి ఇంటికెళ్తే దోశ వేసి ఇచ్చా’రని.. జ్ఞపకాలు పంచుకున్నారు. వెంటనే సుమ.. మాకూ ఆ అదృష్టం దక్కాలని కోరుకుంటున్నానని అన్నారు.
