బ్యాంకుల్లో వున్న తమ సొమ్ము తీసుకోవడానికి జనం తమ ప్రాణాల్ని పణంగా పెట్టాల్సి వచ్చిన రోజులవి. వెయ్యి రూపాయల నోటు, అప్పటికి అమల్లో వున్న 500 రూపాయల నోటు రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేశాక.. కొత్త 2 వేల రూపాయల నోటు, కొత్త 500 రూపాయల నోటు అమల్లోకి వచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో దేశంలో సామాన్యుడికి కరెన్సీ దొరకడం కనాకష్టంగా మారిపోయింది. కానీ, శేఖర్రెడ్డి అనే వ్యక్తి మాత్రం.. కొత్త నోట్లు.. అవీ 2 వేల రూపాయల నోట్లు.. పెద్ద యెత్తున సంపాదించగలిగాడు. అదెలా.? అన్నది ఇప్పటికీ మిస్టరీనే.
దాదాపు 247 కోట్ల రూపాయలు ఆయన వద్ద దొరకడం అప్పట్లో పెను సంచలనం. సరాసరి రిజర్వు బ్యాంకు నుంచే ఆయనకు ఈ కరెన్సీ అందిందనే ప్రచారం జరిగింది. కానీ, అభియోగాలేవీ నిరూపితమవలేదు. శేఖర్రెడ్డి అప్పట్లో టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. ఇప్పుడూ ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. అప్పల్లో శేఖర్రెడ్డిని చంద్రబాబుకి బినామీగా అభివర్ణించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. చిత్రంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా శేఖర్రెడ్డికి టీటీడీ బోర్డు సభ్యత్వం లభించింది.
శేఖర్రెడ్డిపై ఆరోపణలు రాగానే టీడీపీ, ఆయన్ని టీటీడీ బోర్డు నుంచి తొలగిస్తే.. వైసీపీ అధికారంలోకి వస్తూనే, శేఖర్రెడ్డికి మళ్ళీ బోర్డులో సభ్యత్వం కల్పించడం గమనార్హం. మరి, అప్పుడు చంద్రబాబుకి బినామీ అయిన శేఖర్రెడ్డి, ఇప్పుడెవరికి బినామీగా వున్నారు.? అన్నది వైసీపీ నేతలే తేల్చాలి.
శేఖర్రెడ్డి దగ్గర అధికారికంగా 247 కోట్లు లభ్యమైతే, అనధికారికంగా ఈ మొత్తం 2 వేల కోట్లకు పై మాటే.. అనే ప్రచారమూ జరిగింది. అత్యున్నత దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి విచారణ జరిపాయి. కానీ, అది అక్రమ సొమ్ము.. అనడానికి ఆధారాల్లేవట. ఇంతకీ, ఓ సామాన్యుడు 2 వేల నోటు కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సమయంలో శేఖర్రెడ్డికి అంత పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ నోట్లు ఎలా వచ్చాయ్.? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాల్సిందే.
ఎందుకంటే, ఇది ఒక్క శేఖర్రెడ్డికి సంబంధించిన విషయం కాదు.. రాజకీయ పార్టీల తాలూకు రాజకీయ అంశం కూడా కాదు.. దేశ ప్రజలకు సంబంధించిన విషయం.
32235 827037If running proves to be a difficulty then it may possibly be wise to find alternative exercises such as circuit training, weight training, swimming or cycling. 779337
204292 962770my grandmother is always into herbal stuffs and she always say that ayurvedic medicines are the most effective stuff 678905