పంజాబ్ పర్యటనకు వెళ్ళిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. నడి రోడ్డు మీద ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ 20 నుంచి 30 నిమిషాల సేపు నిలిచిపోయింది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయ్. ఈ విషయమై దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతోంది. కమలనాథులు మీడియా ముందుకొచ్చేసి, పంజాబ్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసేస్తున్నారు.
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా భద్రతాపరమైన వైఫల్యాలకు తమ రాష్ట్రంలో ఆస్కారమిచ్చే అవకాశమే వుండదు. ఎందుకంటే, ప్రధాని రక్షణ కోసం ఖచ్చితమైన ప్రోటోకాల్ వుంటుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కేంద్ర హోం శాఖ తీసుకుంటుంది. రాష్ట్ర హోం శాఖ కూడా ఈ విషయంలో కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకే పనిచేస్తుంటుంది.
మరెలా, పంజాబ్ పర్యటనలో నరేంద్ర మోడీ భద్రతకు ఇబ్బందులు కలిగినట్లు.? రూట్ క్లియరెన్స్ విషయంలో ఎక్కడ రాష్ట్ర పోలీసు యంత్రాంగం వైఫల్యం చెందినట్లు.? ఇలా సమస్య తలెత్తగానే, అలా రాజకీయ విమర్శలు పుట్టుకొచ్చేశాయి. విపరీతమైన సింపతీ వేవ్ ప్రధాని మోడీ వైపుగా వచ్చేందుకు వీలుగా పబ్లిసిటీ హైడ్రామా నడిచింది.
చూస్తోంటే, ఇదంతా పక్కా ప్లానింగ్ ప్రకారం జరిగినట్లే భావించాలేమో. ప్రధాని తనంతట తానుగా ఈ పబ్లిసిటీ స్టంట్ చేశారా.? అన్న దిశగా విపక్షాల నుంచి విమర్శలు పోటెత్తుతున్నాయి.
అయితే, ప్రధాని భద్రత విషయంలో డొల్లతనం బయటపడటం పట్ల కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎవరి పబ్లిసిటీ స్టంట్ అయినా, ఎవరి వైఫల్యం అయినా.. అక్కడ ప్రధాని భద్రతకు ముప్పు వాటిల్లినట్లే గనుక, ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాల్సిందేనన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర హోం శాఖ మాత్రమే కాదు, కేంద్ర హోం శాఖ కూడా ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహించాలి.
Additionally, there must be satisfactory place available for helpful the exact same.
990497 944864I was suggested this site by my cousin. Im not confident whether this post is written by him as no one else know such detailed about my trouble. You are wonderful! Thanks! xrumer 207773
Greetings, good website you have got in here. [url=http://test.mail.co.kr/bbs/board.php?bo_table=free&wr_id=469685]acheter lasix en Belgique prix[/url]