Switch to English

సంక్రాంతికి నారావారిపల్లె వేదిక.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రాకతో గ్రామంలో సందడి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,172FansLike
57,764FollowersFollow

చంద్రగిరి మండలంలోని నారావారిపల్లె మరోసారి రాజకీయ, కుటుంబ, సాంస్కృతిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్య–ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కలిసి నారావారిపల్లెకు చేరుకున్నారు. సంక్రాంతి పండుగ వేళ సీఎం స్వగ్రామానికి వచ్చిన నేతలకు రంగంపేట వద్ద ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు, నినాదాలతో వాతావరణం ఉత్సాహంగా మారింది.

సంక్రాంతికి నారావారిపల్లె వేదిక.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రాకతో గ్రామంలో సందడి

నారావారిపల్లెకు చేరుకున్న మంత్రి నారా లోకేష్ ప్రజలతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ, పలువురితో ఫోటోలు దిగారు. గ్రామస్తులతో సన్నిహితంగా మాట్లాడిన ఆయన, వారి సమస్యలు, అభివృద్ధి అవసరాలపై కూడా ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈసారి సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా స్వగ్రామంలోనే జరుపుకోవాలని నారా, నందమూరి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. నాలుగు రోజుల పాటు సీఎం చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లెలోనే బస చేయనున్నారు.

సంక్రాంతికి నారావారిపల్లె వేదిక.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రాకతో గ్రామంలో సందడి

సంక్రాంతి సంబరాల సందర్భంగా బంధువులు, గ్రామస్థులతో కలిసి వేడుకల్లో పాల్గొనడంతో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో సీఎం పాల్గొననున్నట్లు సమాచారం. ఇప్పటికే గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. సీఎం స్వగ్రామంలో జరిగే ఈ సంక్రాంతి సంబరాలు రాజకీయంగా కూడా ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రజలతో నేరుగా మమేకమవుతూ పండుగను జరుపుకోవడం నారావారిపల్లెకు మరోసారి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని స్థానికులు పేర్కొంటున్నారు.

సంక్రాంతికి నారావారిపల్లె వేదిక.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రాకతో గ్రామంలో సందడి

సినిమా

విజయ్–రష్మిక పెళ్లి వివరాలు లీక్? కుటుంబాలకు తలనొప్పి

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న వివాహ వేడుకలకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో లీక్ అవుతుండటం కలకలం రేపుతోంది. పెళ్లి తేదీ, వేదిక,...

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ వైరల్..! ఎవరిని ఉద్దేశించి ఆ...

Dil Raju: ‘నేటి రోజుల్లో నిర్మాతకు విలువలేద’ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఎవరిని ఉద్దేశించి ఆయన...

మే 1న పిల్లల కోసం ‘సమ్మర్ హాలిడేస్’.. థియేటర్లలోకి రాబోతున్న కొత్త...

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ధీరజ్ మొగిలినేని, తన బ్యానర్ ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కొత్త చిత్రాన్ని...

విజయ్–రష్మిక పెళ్లి తేదీ ఖరారు.. ఫిబ్రవరి 26 ముహూర్తానికి ప్రత్యేకత

టాలీవుడ్‌లో మోస్ట్ రూమర్డ్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం త్వరలో జరగనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న...

హే బల్‌వంత్‌పై భారీ అంచనాలు.. సుహాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్న...

బన్నీవాస్, వంశీ నందిపాటి సక్సెస్ కాంబినేషన్ నుంచి వస్తున్న ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘హే బల్‌వంత్’ ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది....

రాజకీయం

హిందూపురం బాలిక కేసులో కీలక మలుపు: ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్, ఇద్దరు నిందితులు అరెస్ట్

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో మూడు రోజుల క్రితం బయటపడిన మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు గోవర్ధన్...

Breaking News: బొత్సపై హెరిటేజ్ లీగల్ నోటీసు..

అమరావతి: తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారంటూ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్...  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు...

నారా లోకేష్ మీద దుష్ప్రచారం.! పరువు పోగొట్టుకున్న వైఎస్సార్సీపీ.!

కోటి రూపాయల ప్రజాధనాన్ని నారా లోకేష్ దుర్వినియోగం చేసిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం, ఆ పార్టీ పరువుని బజార్న పడేసింది. ఇటీవల కొలంబోలో ఇండియా - పాకిస్తాన్ జట్ల మధ్య...

ఫలితాల దిశగా కూటమి ప్రభుత్వ సమర్ధ నీటి నిర్వహణ కార్యక్రమాలు

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ నీటి నిర్వహణ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల్లో కీలకమైన నీటి భద్రత దిశగా రాయలసీమలోని అన్నమయ్య జిల్లా గట్టి...

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

ఎక్కువ చదివినవి

హిందూపురం బాలిక కేసులో కీలక మలుపు: ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్, ఇద్దరు నిందితులు అరెస్ట్

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో మూడు రోజుల క్రితం బయటపడిన మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు గోవర్ధన్...

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డ్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది: సంతోష్ శోభన్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా థియేటర్లలో మంచి స్పందనతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి వస్తున్న ఆదరణతో ఈ చిత్రం సూపర్ హిట్...

Daily Horoscope: ఉద్యోగాల్లో పురోగతి.. కుటుంబంలో శుభవార్తలు

ఫిబ్రవరి 18, 2026 బుధవారం రాశిఫలాలు: మేషం (Aries): కొత్త పనులకు శుభారంభం చేసే అవకాశం ఉంటుంది. కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఆశించిన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో సమయం...

డిజాస్టర్ తర్వాత కూడా తగ్గని రామ్ చరణ్ క్రేజ్.. ‘పెద్ది’ ఓవర్సీస్ డీల్ ఎంతంటే?

గేమ్ ఛేంజర్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా రామ్ చరణ్ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం పడలేదని తాజా ఓవర్సీస్ బిజినెస్ చెబుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదలకు...