మీడియాకు దూరంగా చరణ్‌, బాలయ్య, వెంకీ.. ఎందుకు..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,670FansLike
57,764FollowersFollow

సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు వస్తున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ హీరోగా శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్, బాలయ్య హీరోగా బాబీ డైరెక్షన్ లో డాకూ మహారాజ్, వెంకీ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రాబోతున్నాయి. అయితే ఈ మూడు సినిమాలు ప్రమోషన్ల విషయంలో ఒకేలా ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహిస్తున్నాయి కానీ.. హీరోలు మాత్రం మీడియా ముందుకు రావట్లేదు. ఏదైనా ప్రోగ్రామ్ లకు అటెండ్ అవుతున్నారే తప్ప.. మీడియా ముందుకు వచ్చి ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు. రామ్ చరణ్ కేవలం ఈవెంట్ లకు మాత్రమే వచ్చాడు.

బాలయ్య కూడా అంతే. అటు సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్లలో వెంకీ ప్రమోషన్లలో పాల్గొన్నాడు తప్ప మీడియా ముందుకు రాలేదు. కేవలం డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. ఇదే అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. మీడియా ప్రశ్నలను ఎదుర్కునేందుకు వారు మొహమాట పడ్డారేమో అనిపిస్తుంది. పుష్ప-2 సమయంలో సంధ్య థియేటర్ ఘటన, తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించడం లాంటి వాటిపై ప్రశ్నలు వస్తాయని వారు దూరంగా ఉన్నారేమో అనే ప్రచారం కూడా జరిగింది. ఇంకొన్ని సార్లు తెలుగులో ప్రమోషన్లు పెద్దగా అవసరం లేదని బాలయ్య, వెంకీ భావించారేమో అనిపిస్తోంది.

రామ్ చరణ్‌ తెలుగుతో పాటు ముంబై ఇతర రాష్ట్రాల్లో ప్రమోషన్లు చేశారు. కానీ అక్కడ కూడా మీడియా ముందుకు రాలేదు. మొత్తంగా హీరోలు సేఫ్ జోన్ లోనే ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

సినిమా

సొంత ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. 180 మంది...

హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రాంతానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విద్యారంగంలో మరో ప్రశంసనీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

అచ్చంపేట వేదికగా విజయ్-రష్మిక మధుర క్షణాలు.. సోషల్ మీడియాలో ‘కపుల్ గోల్స్’...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం కోసం అచ్చంపేటకు వెళ్లిన సినీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు....

బుచ్చిబాబు క్షమాపణలపై అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు.. ఆసక్తికర చర్చకు దారితీసిన స్పందన

పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన వివాదం నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు చేసిన క్షమాపణలపై ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ స్పందించారు. ఈ విషయంపై...

పెద్ది చిత్రానికి మరో కొత్త ఆకర్షణ.. బుధవారం నుంచి ఎక్స్‌టెండెడ్ కట్

ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న పెద్ది సినిమాకు ఇప్పుడు మరో ప్రత్యేక ఆకర్షణ జోడించబడుతోంది. చిత్ర బృందం తాజా ప్రకటన ప్రకారం, బుధవారం నుంచి...

Vijay Devarakonda: ఊరికిచ్చిన హామీని నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: ఇటివల హీరో విజయ్ దేవరకొండ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయ్ తండ్రి స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటలోని...

రాజకీయం

సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం: ఢిల్లీలో జనసేన కీలక సమావేశం

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. "సేన ప్రస్థానం... జాతీయ...

తుని చిన్నారి ఆచూకీపై పవన్ కళ్యాణ్ ఆందోళన.. గాలింపును వేగవంతం చేయాలని ఆదేశం

కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి సమీక్ష...

డీఎస్సీ వివాదం.. లోకేశ్‌ను టార్గెట్ చేస్తున్న వైసీపీపై రాజకీయ చర్చ

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, కూటమి...

పైకి సింగిల్‌ సింహం… లోపల డబుల్‌ గేమ్‌?

రాజకీయాల్లో మాటలు ఒకలా, వ్యూహాలు మరోలా ఉండటం కొత్త విషయం కాదు. అయితే "సింహం సింగిల్‌గా వస్తుంది" అనే నినాదాన్ని ఎన్నో ఏళ్లుగా ప్రచారం చేసుకున్న వైసీపీ ఇప్పుడు రాజకీయ వాస్తవాల ముందు...

వెన్నుపోటు ఎవరు చేశారు?.. వైసీపీపై అప్పసాని రాజేష్ విమర్శలు

ఏపీలో ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల నేపథ్యంలో వైసీపీపై,  తెలుగుదేశం  పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తీవ్ర విమర్శలు చేశారు. ‘రెండేళ్ల నమ్మకం,...

ఎక్కువ చదివినవి

Peddi: స్పందించిన అల్లు అర్జున్.. పెద్ది గురించి ఏమన్నాడంటే?

రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న వేళ, ఈ సినిమాపై అల్లు అర్జున్ కూడా తన స్పందన తెలియజేశారు. సినిమా విడుదలై కొన్ని రోజులు గడిచిన తర్వాత పెద్ది...

పరామర్శకు వెళ్లిన లోకేష్.. ఆస్పత్రి వద్ద రాజకీయ వివాదం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు మంత్రి నారా లోకేష్ కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లిన సందర్భంగా రాజకీయ వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఆరోపణలు ప్రస్తుతం...

Ram Charan: రామ్ చరణ్ నటను ఎవరో ప్రశంసించాలా..? వ్యక్తిత్వమే ఆయన విజయం

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అన్ని ఏరియాల్లో ప్రేక్షకాదరణ పొంది మంచి వసూళ్లు నమోదు చేస్తోంది. సినిమాలో రామ్...

Chiranjeevi: ‘ఆయన తెలుగు సినిమా భీష్మాచార్యుడు’.. ‘సింగ్ గీతం’కు చిరంజీవి ప్రశంస

Chiranjeevi: ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావును తెలుగు సినిమా భీష్మాచార్యుడిగా అభివర్ణించారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సింగ్ గీతం’. మరో స్టార్ డైరక్టర్ నాగ్ అశ్విన్ ఈ...

Chiranjeevi-Suhasini: మణిరత్నం సినిమాలో ఆ సన్నివేశానికి చిరంజీవే స్ఫూర్తి: సుహాసిని

Chiranjeevi-Suhasini: తెలుగులో అత్యధిక సినిమాల శతదినోత్సవాలు జరిపిన హీరోగా మెగాస్టార్ చిరంజీవిదే రికార్డు. విజేత మొదలు ఎన్నో సినిమాలకు ఆయన అనేక పట్టణాలు, నగరాల్లో తన సక్సెస్ సినిమాలకు శతదినోత్సవాలు జరిపారు. గ్యాంగ్...