ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటినా సంపత్ నంది ఇప్పటివరకూ తెరకెక్కించినవి కేవలం నాలుగు సినిమాలు మాత్రమే. ప్రస్తుతం గోపీచంద్ తో కలిసి సీటిమార్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఈ ఏడాది విడుదల చేయాలనుకున్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యం కాకపోవచ్చు. ప్రస్తుతం 40 శాతం దాకా షూటింగ్ పూర్తయిందని, అనుమతులు రాగానే షూటింగ్ లు మొదలుపెడతామని తెలిపాడు. ఇకపై కెరీర్ లో గ్యాప్ రాకుండా చూసుకుంటానని, ఏడాదికి ఒక సినిమా అయినా వచ్చేలా జాగ్రత్త పడతానని అంటున్నాడు.
ఇక తన ఫ్యూచర్ సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్, చిరంజీవి టార్గెట్ లుగా స్క్రిప్ట్ లు రాస్తున్నట్లు తెలిపాడు సంపత్. పవన్ తో సర్దార్ గబ్బర్ సింగ్ కు కలిసి పనిచేయాల్సింది కానీ కుదర్లేదు. అయితే త్వరలోనే పవన్ తో పనిచేస్తానని నమ్మకంగా చెబుతున్నాడు. త్వరలోనే పవన్ కోసం రాసుకున్న కథను వినిపిస్తానని అంటున్నాడు.
అలాగే మెగాస్టార్ చిరంజీవితో పనిచేయడం తన కల అని, ఆయన హీరోగా రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో కథ అనుకుంటున్నట్లు తెలిపాడు. చిరంజీవికి ప్యాన్ ఇండియా సినిమాగా ఇది పెర్ఫెక్ట్ సెట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో కచ్చితంగా త్వరలో పనిచేస్తానని చెబుతున్నాడు ఈ దర్శకుడు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
513626 334833I view something genuinely special in this internet site . 868173
93939 657270learning toys can enable your kids to develop their motor skills quite easily;; 855075