Sajjala Ramakrishna Reddy Failure: అసలేం జరుగుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో.! డిఫాక్టో సీఎం.. సకల శాఖల మంత్రి.. ఇలా రకరకాల గుర్తింపులున్న వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ వైఫల్యాల్ని ఎందుకు లైట్ తీసుకుంటున్నారు.? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే, ‘వాళ్ళు మా ఓటర్లు కాదు..’ అని తేల్చేశారు సజ్జల.
అంటే, ఆ ఓటర్లెవరూ 2024లో వైసీపీకి ఓట్లెయ్యొద్దన్ని సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా చెప్పినట్లే భావించాలేమో.! మరిప్పుడు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీ ఓ సీటుని కోల్పోయింది. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టికి ఓట్లేశారు. ఇక్కడా, ‘ఆ ఓటర్లు మావాళ్ళు కాదు..’ అంటూ సజ్జల ప్రకటించగలరా.?
‘దమ్ముంటే, 175 నియోజకవర్గాల్లోనూ సింగిల్గా పోటీ చేస్తామని చంద్రబాబు ప్రకటించాలి..’ అంటూ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఎలా పరిగణనలోకి తీసుకోవాలో ఏమో.!
నిజానికి, ఇలాంటి పరిస్థితుల్ని డీల్ చేయగల చాణక్యం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలో బాగా కనిపిస్తుంటుంది. కానీ, ఆయనెందుకో ఈ మధ్య బాగా సైలెంటయిపోయారు. విజయసాయిరెడ్డి ట్విట్టర్లో కూడా విపక్షాలపై విమర్శలు పెద్దగా కనిపించడంలేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ అరుదుగానే కనిపిస్తున్నారు.
అధినేత అప్పగించిన పని మాత్రమే పూర్తి చేస్తున్నారు తప్ప, ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదు విజయసాయిరెడ్డి. వైసీపీలో విజయ సాయిరెడ్డి ‘పాత్ర’ తగ్గడానికి కారణం సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నది బహిరంగ రహస్యం. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా విజయ సాయి రెడ్డి పరిశీలిస్తున్నారట.
అధినేత మళ్ళీ తనకు బాధ్యతలు అప్పగిస్తే, తానేంటో నిరూపిస్తానని అంటున్నారట ఆయన తన సన్నిహితులతో. కానీ, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం వుండదు కదా.? కానీ, విజయసాయిరెడ్డి ఇప్పుడేమీ చేయలేని పరిస్థితి. అంతా సజ్జల కనుసన్నల్లోనే నడుస్తోంది.!
645545 941962Excellent process! 121742
343058 551608hey I was really impressed with the setup you used with this blog. I use blogs my self so excellent job. definatly adding to bookmarks. 877736