మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా సూపర్ హిట్ కాగా, దానికంటే ముందు మొదలై, తర్వాత విడుదలైన రేయ్ పరాజయం పాలైంది. ఆ తర్వాత విడుదలైన సుప్రీమ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి సాయి ధరమ్ తేజ్ కు స్థిరమైన మార్కెట్ ను తీసుకొచ్చాయి. అయితే ఆ తర్వాతి నుండే మొదలయ్యాయి తేజ్ కు కష్టాలు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు సినిమాలు ప్లాపులుగా మిగిలాయి. దీంతో సాయి తేజ్ కెరీర్ మొత్తంగా పడిపోయింది. అయితే గతేడాది తన పేరు నుండి ధరమ్ ను తీసేయడం బాగా కలిసొచ్చింది. సంఖ్యాశాస్త్రం వర్కవుటై గతేడాది రెండు హిట్స్ కుదిరాయి. చిత్రలహరి, ప్రతిరోజూ పండగే చిత్రాలు మళ్ళీ తేజ్ కెరీర్ కు ఊపునిచ్చాయి.
ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటరు అనే సినిమా చేస్తున్నాడు తేజ్. ఆ తర్వాత దేవా కట్టా దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయిన సంగతి తెల్సిందే. ఇటీవలే సాయి తేజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో అత్యంత కలత చెందిన విషయం గురించి స్పందించాడు. తాను పదో క్లాసులో ఉన్నప్పుడు అమ్మ, నాన్న విడిపోవడం అత్యంత బాధాకరమైన సంఘటనగా పేర్కొన్నాడు. వాళ్ళిద్దరికీ పొసగలేదు. విడాకులు తప్పనిసరి అయ్యాయి. అది ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది అని చెప్పాడు తేజ్. అయితే అది గతం. అప్పటినుండి అమ్మయినా నాన్న అయినా అమ్మే. ఆ తర్వాత అమ్మ, ఒక డాక్టర్ ను రెండో వివాహం చేసుకుంది. ఆయన చాలా మంచి వారు అని చెప్పుకొచ్చాడు.
507496 866929Some actually excellent info , Gladiola I located this. 948096
196667 23391its excellent as your other articles : D, regards for posting . 300002
589529 247276you use a fantastic weblog here! do you need to have to make some invite posts on my blog? 330831