శబరిమల వివాదం మళ్ళీ మొదటికొచ్చింది. ఆలయంలోకి మహిళల ప్రవేశం సబబేనా.? కాదా.? అన్నదానిపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ కొనసాగుతున్న విషయం విదితమే. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు తాజాగా తీర్పునిచ్చింది. అయితే, ఆ తీర్పులో ఈ విషయాన్ని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయాలని వుండడమే విశేషం.
శబరిమల అయ్యప్ప దేవస్థానం మరో రెండు రోజుల్లోనే తెరుచుకోన్నున దరిమిలా, ఈ సమయంలో సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కొంత గందరగోళం కన్పిస్తోంది. గతంలో సర్వోన్నత న్యాయస్థానం శబరిమలలోకి మహిళల్ని వయసుతో నిమిత్తం లేకుండా అనుమతించాలని తీర్పునిచ్చిన విషయం విదితమే.
ఆ తీర్పుని పునఃసమీక్షించాలంటూ పెద్దయెత్తున సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం, ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి ఈ కేసు విచారణను బదిలీ చేసింది. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. అంటే, శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలకు అనుమతి వున్నట్టే లెక్క.
గత ఏడాది, కొందరు మహిళలు అయ్యప్పస్వామిని శబరిమల ఆలయంలో దర్శించుకునేందుకు ప్రయత్నించడం, ఒకరిద్దరికి మాత్రమే దర్శనం లభించడం, ఆ తర్వాత ఆలయ సంప్రోక్షణ జరపడం తెల్సిన విషయాలే. కాగా, సుప్రీంకోర్టు తీర్పుని అడ్డంపెట్టుకుని, అన్యమనస్తులు ఆలయ పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ మేరకు కొందరు అన్యమతస్తులైన మహిళల్ని శబరిమల పరిసరాల్లో అయ్యప్ప స్వామి భక్తులు అడ్డుకుని, పోలీసులకు అప్పగించారు కూడా. మరి, ఈసారి పరిస్థితులు ఎలా వుండబోతున్నాయో వేచి చూడాల్సిందే.
50437 525375extremely good post, i undoubtedly truly like this exceptional internet site, carry on it 911730
716582 299607Hosting a blog composing facility (in a broad sense) requires unlimited space. So I suggest you to discover such internet hosting (internet space provider) that provide flexibility inside your internet space. 253072
351430 570756I think you did an awesome job explaining it. Positive beats having to research it on my own. Thanks 948527