ఏపీ సీఐడీ డీజీ సునీల్కుమార్ పై వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సునీల్ కుమార్ ను బెయిల్ బ్యాచ్ అంటూ.. తనపై వ్యాఖ్యలు చేసే అర్హత లేదని విమర్శించారు. తనపై బెయిల్ బ్యాచ్ అంతా కలిసి విమర్శలు చేస్తుంటే నీతులు వల్లిస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.
సునీల్ కుమార్ పై గృహహింస కేసు ఉందని అన్నారు. చట్టం దృష్టిలో నిందితుడిగా తేలిన సునీల్కుమార్ మరో ఇద్దరు నిందితులతో కలిసి తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారని ఎంపీ ఆరోపించారు. వీరి బాగోతంపై సరైన సమయంలో.. సమగ్ర వివరాలతో వారిపై 420 చట్టం కింద ఫిర్యాదు చేస్తానన్నారు. సీబీఐ విచారణలో అన్ని విషయాలు బయటికొస్తాయని ఈ సందర్భంగా అన్నారు.
సునీల్ కుమార్ తోసహా మరికొందరు తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని రఘురామ అన్నారు. సునీల్ కుమార్పై ఆయన భార్య గృహహింస కేసు వేసిన విషయం మరచిపోకూడదని అన్నారు. సునీల్ కుమార్ పై గృహహింస కేసులో ఛార్జ్షీట్ నమోదైందని ఆయనకు తనను విమర్శించే హక్కు లేదని అన్నారు.
466996 481506Ive read several great stuff here. Surely value bookmarking for revisiting. I surprise how a lot effort you put to create 1 of these superb informative website. 910468
526201 290665Yay google is my king aided me to find this outstanding internet site! . 931600
989626 823689Music began playing anytime I opened this web site, so irritating! 607768