గోదావరి నదిలో సుమారు 50 మందిని బలికొన్న రాయల్ వశిష్ట బోటు ఎట్టకేలకు బయటకొచ్చింది.. అదీ దాదాపు 40 రోజుల తర్వాత. సెప్టెంబర్ 15న ప్రమాదం జరిగితే, అక్టోబర్ 22వ తేదీన బోటుని బయటకు తీసుకురాగలిగారు. గోదావరి నదిలో వరద ఉధృతి కారణంగా బోటు వెలికి తీత పనులకు ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవం. అయితే, ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించకపోవడం వల్లే బోటు వెలికి తీత ఆలస్యమయ్యిందన్న విమర్శలు ఇప్పటికీ విన్పిస్తున్నాయి.
ధర్మాడి సత్యం బృందం బోటుని కాస్సేపటి క్రితం బయటకు తీసింది. బోటు నుంచి కుళ్ళిన దశలో మృతదేహాలు బయటపడ్తున్నాయి. వాటిని ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలిస్తున్నారు. ఇదిలా వుంటే, బోటు ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది ఆ బోటులో వున్నారన్నదానిపై ఇప్పటికీ ఓ స్పష్టత లేదు. 90 మందికి పైగా బోటులో ప్రయాణిస్తున్నట్లు మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే.
తొలుత 60 మంది ప్రయాణీకులు వున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం, ఆ తర్వాత ఆ సంఖ్యని 77కి చేర్చింది. బోటు పూర్తి స్థాయిలో బయటకు వచ్చాక కూడా, ఎంతమంది ఆ రోజు ఆ బోటులో ప్రయాణించారో ఇప్పటికీ ఖచ్చితంగా చెప్పలేని దుస్థితి. వరద తీవ్రత దృష్ట్యా చాలా మృతదేహాలు ఇప్పటికే కొట్టుకుపోయాయి. కొన్ని మృతదేహాలు మాత్రం లభ్యమయ్యాయి.
అసలు ప్రమాదకర స్థితిలో ప్రవాహం వున్నప్పుడు గోదావరి నదిలోకి బోటుని ఎలా అధికారులు అనుమతించారన్న ప్రశ్నకు ఇప్పటిదాకా సమాధానం దొరకలేదు. అంతే కాదు, సాక్షాత్తూ మంత్రి అవంతి శ్రీనివాస్కి ఈ బోటుతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు వచ్చినా, ఆ ఆరోపణలకు నివృత్తి జరగని పరిస్థితి.
చంద్రబాబు హయాంలో బోటు ప్రమాదం జరిగితే, ప్రభుత్వ పెద్దలపై క్రిమినల్ కేసులు పెట్టాలన్న అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో వుండి ప్రభుత్వంపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టించలేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
654090 971030Excellent post man, maintain the good function, just shared this with my friendz 249387
146758 398133Id need to speak with you here. Which is not some thing I do! I spend time reading an write-up that could get individuals to feel. Also, appreciate your permitting me to comment! 216156