Switch to English

సిగ్గు సిగ్గు: విశాఖలో ‘నయా’ నిస్సిగ్గు రాజకీయం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

కొన్నాళ్ళ క్రితం అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని విశాఖ విమానాశ్రయంలోనే నిర్బంధించారు. అది ప్రత్యేక హోదా కోసం ఉద్యమం గట్టిగా జరుగుతున్న సమయంలో. ఇప్పుడు విశాఖ విమానాశ్రయం దగ్గరే ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడికి చుక్కలు చూపిస్తోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. అప్పుడూ ఇప్పుడూ అదే పోలీసులు. ఏది న్యాయం.? ఏది అన్యాయం.?

ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వెళితే ప్రభుత్వానికి ఎందుకంత భయం.? అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. కానీ, ‘భయం’ మాత్రం అదే.! కనీ వినీ ఎరుగని స్థాయిలో విశాఖ విమానాశ్రయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 500 నుంచి 1000 రూపాయలు వెచ్చించి మరీ కిరాయి రౌడీల్ని అధికార పార్టీ తీసుకొచ్చిందనే విమర్శలు టీడీపీ నుంచి ఎదురవుతుండడం గమనార్హం. ‘పెయిడ్‌ ఆర్టిస్టులు..’ అనే మాట టీడీపీ నోట విన్పిస్తోంది. కానీ, ఇది ప్రజాస్వామిక నిరసన.. అని అధికార పార్టీ చెబుతోంది. ఏది నిజం.?

అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తోంటే.. అక్కడ ‘పెయిడ్‌ ఆర్టిస్టులు’ ప్రభుత్వానికి కన్పించారు. సాధారణ రైతులపై పోలీసులు లారీలు ఝుళిపించారక్కడ. కానీ, విశాఖలో విమానాశ్రయం దగ్గర.. వైసీపీ కార్యకర్తలు వీధి రౌడీల్లా ప్రవర్తిన్నా పోలీసులు చూస్తూ ఊరుకుండిపోయారు. పైగా, పోలీసులే వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారన్నది టీడీపీ ఆరోపణ. ఎవరి వాదనలు వారివే. ఒక్కటి మాత్రం నిజం. ఇరు పార్టీలూ కలిసి ప్రశాంతతకు మారు పేరైన విశాఖపట్నం నగరాన్ని రావణ కాష్టంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

చంద్రబాబు టూర్‌కి అనుమతిస్తే, ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటి.? నాలుగు రాజకీయ విమర్శలు చంద్రబాబు చేయడం తప్ప.. అంతకు మించి జరిగేదేమీ వుండదు. ఆ విషయం వైసీపీ ప్రభుత్వానికి తెలియదని అనుకోలేం. కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయి విశాఖ కేంద్రంగా. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖను గుర్తించిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, ఇక్కడ ఆందోళనలకు ఆస్కారమివ్వకూడదు మామూలుగా అయితే. కానీ, తమ పార్టీ కార్యకర్తల్ని, ప్రతిపక్షం పైకి వైసీపీ ఉసిగొల్పిందంటేనే.. విశాఖపై ఆ పార్టీకి వున్న చిత్తశుద్ధి ఏంటన్నది అర్థమవుతోంది.

విశాఖ ప్రజలు తాజా పరిణామాల్ని విశ్లేషించుకోవాలి. వైసీపీతోపాటు టీడీపీ రాజకీయ డ్రామాల్నీ అర్థం చేసుకోవాలి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

రాముడి విగ్రహం తల నరికినోళ్ళకి.. అర్చకులు ఓ లెక్కా.?

అంతర్వేది రథం తగలబడితే.. దోషులెవరో దొరకలేదు. వైసీపీ పాలనలో వ్యవస్థలు ఎలా తగలడ్డాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? తేనెపట్టుని తీసే ప్రయత్నంలో ఆకతాయిలెవరో మంట పెడితే, అంతర్వేది రథం తగలబెట్టారంటూ వైసీపీ...

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ అవకాశం కోసం ఎంతమంది ఎదురు చూస్తుండ్రు’...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...