Switch to English

బెట్టు వీడిన రోజా.. తెరవెనుక కథ ఇదీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ఎట్టకేలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా బెట్టు వీడారు. అమరావతిలో ప్రత్యక్షమయ్యారు. మంత్రి పదవి దక్కకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిన రోజా, చాలా తొందరగానే ‘కవరేజ్‌ ఏరియా’లోకి రావడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఊపిరి పీల్చుకుంది. రోజా అంటే రాజకీయాల్లో రెబల్‌ స్టార్‌ కిందే లెక్క.

ఏ పార్టీలో వున్నా, ప్రత్యర్థులపై పదునైన విమర్శనాస్త్రాలతో విరుచుకుపడటం ఆమె స్టయిల్‌. ఈ క్రమంలో ఒక్కోసారి సంయమనం కోల్పోతుంటారు. బూతులు కూడా తిట్టేస్తుంటారు. అదే, ఆమెకు మంత్రి పదవి రాకుండా చేసిందా? ఏమోగానీ, మంత్రి పదవి దక్కకపోవడం గురించి రోజాని ప్రశ్నిస్తే, ‘సామాజిక వర్గ సమీకరణాల కారణంగానే మంత్రి పదవి రాలేదేమో. పరిస్థితుల్ని నేను అర్థం చేసుకోగలను. అసంతృప్తి ఏమీ లేదు’ అని రోజా క్లారిటీ ఇచ్చేశారు. మరోపక్క, రోజాని బుజ్జగించే బాధ్యతను వైఎస్‌ జగన్‌, వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డికి అప్పగించారు. దాంతో, విజయసాయిరెడ్డి స్వయంగా రోజాతో మాట్లాడేందుకు రెండు మూడు రోజులుగా ప్రయత్నించి, చివరికి విజయం సాధించినట్లే కన్పిస్తోంది. ‘మంత్రి పదవి రాకపోవడానికి గల కారణాల్ని వివరిస్తూ, భవిష్యత్తులో మంచి అవకాశాలుంటాయి’ అని విజయసాయిరెడ్డి, వైఎస్‌ జగన్‌ మాటగా చెప్పేసరికి రోజా సర్దుకుపోయారట.

మంత్రి పదవి ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, చీఫ్‌ విప్‌ పదవి అయినా ఇవ్వొచ్చు కదా! అని రోజా, విజయసాయిరెడ్డికి సూటి ప్రశ్నే వేశారట. ‘రెండున్నరేళ్ళలో మెజార్టీ మంత్రులు మారిపోతారు. అప్పుడు కీలక పదవి దక్కుతుంది’ అని విజయసాయిరెడ్డి, జగన్‌ చెప్పిన మాటను పునరుద్ఘాటించారట. ‘అప్పుడైనా పదవి వస్తుందని ఎలా నమ్మేది.?’ అని రోజా తనదైన స్టయిల్లో ఎదురు ప్రశ్నించడంతో విజయసాయిరెడ్డి దగ్గర ఇంకో మాట లేకుండా పోయిందట. మరోపక్క, ఇంకా బెట్టు చేస్తే కష్టమనీ, సంపూర్ణ మెజార్టీతో వున్న పార్టీపై తిరుగుబాటు చేయడం వల్ల ఉపయోగం లేదని భావించిన రోజా, తనను తాను సర్దిపుచ్చుకుని, విజయసాయిరెడ్డి సూచన మేరకు అజ్ఞాతం వీడారన్న ప్రచారం జరుగుతోంది.

ఇదిలా వుంటే, రోజాతో ఓ వైపు టీడీపీ శ్రేణులు, ఇంకో వైపు బీజేపీ శ్రేణులు టచ్‌లోకి వచ్చాయట గత రెండు మూడు రోజులుగా. ‘పార్టీ మారాల్సిందే.. జనసేన వైపుకు వెళ్ళినా మాకు అభ్యంతరం లేదు’ అని కార్యకర్తలు సైతం, రోజాపై ఒత్తిడి తీసుకొచ్చారట. ఇంత కథ నడిచింది తెరవెనుకాల. చివరికి కథ సుఖాంతమయ్యింది. రోజా ఈజ్‌ బ్యాక్‌, అసెంబ్లీలో ఆమె తన సహజ సిద్ధమైన స్టయిల్లో ఈసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా చెలరేగిపోతారా.? మంత్రి పదవి ఇవ్వలేదన్న ఆవేదనతో సహజ శైలికి భిన్నంగా వ్యవహరిస్తారా? వేచి చూడాల్సిందే.

Related Posts

జగన్‌ 2.0: రోజాకి ‘హోంమంత్రి’ పదవి దక్కేనా!

రోజాకు ఆ పోస్ట్ కన్ఫర్మ్ అయినట్టేనా ?

జగన్‌ ‘రెండున్నర’ ఫార్ములా.. నవ్వుల పాలవుతున్న వేళ

రోజాకి జబర్‌దస్త్‌ వెన్నుపోటు.. పొడిచిందెవరు?

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...