సంచలన నటిగా ఫైర్ బ్రాండ్ గా ఇమేజ్ తెచ్చుకున్న రోజా, నగరి ఎంఎల్ ఏ గా విజయం అందుకుంది. ఆ తరువాత ఎపి ఐ ఐ సి చైర్మన్ గా ఎన్నికయ్యారు. జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రోజా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు భీమిలి కి వెళ్ళింది .. భీమిలితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని పలు ఆసక్తికర విషాలు చెప్పింది.
ముఖ్యంగా తన లవ్ స్టోరీ గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. నా ప్రేమ కథ మొత్తం భీమిలి బీచ్ లోనే జరిగిందని, చామంతి సినిమా సమయంలో భీమిలి బీచ్ లోనే ఏడాది పాటు షూటింగ్ చేశామని చెప్పింది. అక్కడే భానుమతి గారు, సెల్వమణి, ప్రశాంత్, నేను చాలా రోజుల పాటు బీచ్ లోనే ఉన్నామని.. నా సినిమా కెరీర్ ఇక్కడే మొదలైంది .. అలాగే నా ప్రేమ కథ కూడా దర్శకుడు సెల్వమణితో ఇక్కడే మొదలయ్యింది అంటూ చెప్పింది.
సెల్వమణి నాకు ఇక్కడే ఐ లవ్ యు చెప్పడం, ఆ తరువాత పన్నెండేళ్ళు ప్రేమించుకున్నాకా .. పెళ్లి చేసుకున్నామని, ఇప్పుడు పిల్లలు, సంసారం ..గృహిణిగా కూడా చాలా హ్యాపీ గా ఉన్నానని చెప్పింది రోజా. ప్రస్తుతం రాజకీయాల్లో కూడా యాక్టీవ్ గా ఉన్న రోజా మళ్ళీ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సో మొత్తానికి రోజా ప్రేమ్ కహాని అదన్నమాట !!