రిలయెన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చిన అంబానీ.. అక్కడ నుంచి నేరుగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల పెట్టడం గురించే ఇరువరి మధ్యా చర్చ జరిగిందని చెబుతున్నప్పటికీ, ఈ సమావేశం అసలు ఎజెండా మాత్రం రాజకీయపరమైన అంశాలేనని తెలుస్తోంది.
తనకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి ఏపీ కోటాలో రాజ్యసభ సీటు ఇప్పించేందుకే ముకేశ్ అంబానీ నేరుగా జగన్ వద్దకు వచ్చినట్టు సమాచారం. కుమారుడితోపాటు రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ అంబానీ వెంట ఉన్నారు. జార్ఖండ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నత్వానీ పదవీకాలం ముగుస్తోంది. ఇప్పటికే జార్ఖండ్ నుంచి రెండుసార్లు పెద్దల సభకు ఎన్నికైన నత్వానీ.. మరోసారి రాజ్యసభ సభ్యత్వం కోరుతున్నారు. అంబానీకి అత్యంత సన్నిహితుడు కావడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు.
ప్రస్తుతం బీజేపీకి ఎక్కడా రాజ్యసభ సభ్యులను గెలుచుకునే బలం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టిన షా.. వైసీపీ కోటాలో నత్వానీని పెద్దల సభకు పంపించాలని నిర్ణయించారు. మార్చి 26న జరగబోయే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఏపీ నుంచి నలుగురు ఎన్నికవుతారు. అసెంబ్లీలో ఉన్న బలం దృష్ట్యా ఆ నాలుగూ వైఎస్సార్ సీపీకే వస్తాయి. ఈ నేపథ్యంలో ఒక స్థానం తమకు ఇవ్వాలంటూ బీజేపీ జగన్ ను కోరినట్టు గతంలో వార్తలొచ్చాయి.
ఆ క్రమంలోనే జగన్ హడావుడిగా హస్తిన వెళ్లి అటు ప్రధాని మోదీని, ఇటు అమిత్ షాతో భేటీ అయి, దీనిపై చర్చించినట్టు తెలుస్తోంది. షా ప్రతిపాదనకు జగన్ ఓకే చెప్పడంతో అంబానీ అమరావతి వచ్చి మర్యాదపూర్వకంగా జగన్ తో భేటీ అయ్యారు. ఇరువురి మధ్య పలు అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. మొత్తానికి ఒక రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా అటు బీజేపీ పెద్దలకు, ఇటు అంబానీకి జగన్ దగ్గరయ్యారని చెబుతున్నారు. ఈ కీలక రాజకీయ పరిణామం భవిష్యత్తులో జగన్ కు కచ్చితంగా ఉపకరిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
530171 590413This internet web site is typically a walk-through its the info you wished about this and didnt know who ought to. Glimpse here, and you will definitely discover it. 239534
671496 885684hello, i came in to learn about this topic, thanks alot. will put this site into my bookmarks. 435926