పదకొండు వర్సెస్ మూడు, ఇరవై మూడు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,340FansLike
57,764FollowersFollow

‘మేం అధికారంలోకి వస్తే, పదకొండు అనే నెంబర్‌ని పూర్తిగా తొలగిస్తాం..’ అని గనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే.? అసలు అలా జరుగుతుందా.? ఛాన్సే లేదు.! కానీ, ఇలాంటి సెంటైర్లు ఎందుకు పడుతున్నాయ్.! పడతాయ్ మరి.!

నువ్వు నేర్పిన విద్యయే కదా.. అన్న చందాన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూటమి పార్టీల నుంచి ‘పోటు’ మామూలుగా లేదు.! అలాంటిలాంటి పోటు కాదిది.!

వైసీపీ అధికారంలో వున్నప్పుడు పదే పదే ‘ఇరవై మూడు’ అనే సంఖ్య చుట్టూ ఆ పార్టీ నాయకులు సెటైర్లు వేయడం చూశాం. ‘ఇది దేవుడి స్క్రిప్ట్’ అంటూ, 23వ నంబర్ గురించి ప్రస్తావిస్తూ చట్ట సభల్లో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సెటైర్లు వేశారు.

ఎక్కడ, ఏ సందర్భం వచ్చినా, ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తూ 23వ నంబర్‌కి వైసీపీ లింక్ చేస్తూ వచ్చేది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జరిగిన అరెస్టుల విషయంలోనూ ఈ నెంబర్‌ని వైసీపీ అప్పట్లో ఫాలో అయ్యిందన్న విమర్శలున్నాయి.

కట్ చేస్తే, వైసీపీకీ 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయ్. తమకు 23 సీట్లు వచ్చినప్పుడు వైసీపీ తమను ‘23’ గురించి ప్రస్తావిస్తూ సెటైర్లు వేసింది గనుక, తామూ ‘పదకొండు’ చుట్టూ సెటైర్లేస్తామని టీడీపీ అనుకుంటే, అందులో వింతేముంది.?

మరోపక్క, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే క్రమంలో ‘మూడు’ నంబర్ చుట్టూ వెటకారాలు చేసేది వైసీపీ. పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించే ఈ సెటైర్ల పరంపర. మరి, జనసేన ఊరుకుంటుందా.? జనసేన కూడా పదకొండో నెంబర్‌తో సెటైర్లేస్తుంది.

నిన్న శాసన సభ్యుల సాంస్కృతిక ప్రదర్శనల్లో ఓ సెటైరికల్ కామెడీ స్కిట్ సందర్భంగా, పదకొండో నెంబర్.. ప్రస్తావనకు వచ్చింది. అంతే, వైసీపీ నానా యాగీ షురూ చేసింది సోషల్ మీడియా వేదికగా. టీడీపీ, జనసేన ఊరుకుంటాయా.? గతంలో మూడు, ఇరవై మూడు.. అంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ సంబంధిత వీడియోల్ని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు ఇరు పార్టీల కార్యకర్తలు.

అన్నట్టు, వైసీపీ సిద్ధం సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బొమ్మల్ని పెట్టి, వాటిని కాళ్ళతో తన్నించే ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోల్నీ టీడీపీ, జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, వైసీపీకి కౌంటర్ ఎటాక్ ఇస్తున్నాయి.

మిగతా విషయాలెలా వున్నా, పదకొండో నెంబర్‌ చుట్టూ జరుగుతున్న విమర్శల, సెటైర్ల పరంపరని వైసీపీ అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. చేసుకున్నోడికి చేసుకున్నంత.. అంటే ఇదే మరి.!

సినిమా

సైలెంట్‌గా స్టార్‌డమ్ దిశగా భాగ్యశ్రీ బోర్సే..

భారతీయ సినీ పరిశ్రమలో స్టార్‌డమ్ అందరికీ ఒకే విధంగా రాదు. కొందరు ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోతారు. మరికొందరు మాత్రం ఒక్కో సినిమా, ఒక్కో...

Vijay: ‘విజయ్ వెనక ఏదో దైవశక్తి ఉంది’.. నటుడి కామెంట్స్

Vijay: గంటగంటకీ తమిళనాడు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. కూతవేటు దూరంలో సీఎం కాకుండా ఆగిపోయారు టీవీకే పార్టీ అధినేత విజయ్. అయితే.. రాజకీయ పరిణామాలు...

Peddi: ‘పెద్ది’ ప్రమోషన్స్.. హైప్ ఎక్కడ..? ఆందోళనలో ఫ్యాన్స్

Peddi: రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది....

“‘పెద్ది’ సెట్స్ సెట్‌లా కనిపించవు”: అవినాష్ కొల్లా

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా *‘పెద్ది’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

“రామ్ చరణ్ ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు.. చిరంజీవి కుటుంబ...

Lavanya Tripathi ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై...

రాజకీయం

పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లి శివాలయానికి కొత్త రూపు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. గ్రామస్తుల విన్నపాన్ని వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్,...

“టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు బయటికి రాదు”.. అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్‌లో మంత్రి నిమ్మల సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి Nimmala Rama Naidu ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా డోర్నాల సమీపంలోని వెలిగొండ టన్నెల్ పనులను మంత్రి రాత్రి వేళల్లో...

“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకెళ్తున్న ఏపీ”.. రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ప్రజాప్రభుత్వం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి...

“విద్యలో గాలి మేడలు వద్దు.. గట్టి పునాదే ముఖ్యం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను పునాది స్థాయి నుంచి బలోపేతం చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. గాలిలో మేడలు కట్టే ఫ్యాన్సీ విద్యా విధానాల కంటే, విద్యార్థుల్లో ప్రాథమిక...

“డేటా సెంటర్ పరికరాల తయారీలో భారత్ అగ్రగామి కావాలి”: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, కూలింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి...

ఎక్కువ చదివినవి

“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకెళ్తున్న ఏపీ”.. రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ప్రజాప్రభుత్వం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి...

సైలెంట్‌గా స్టార్‌డమ్ దిశగా భాగ్యశ్రీ బోర్సే..

భారతీయ సినీ పరిశ్రమలో స్టార్‌డమ్ అందరికీ ఒకే విధంగా రాదు. కొందరు ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోతారు. మరికొందరు మాత్రం ఒక్కో సినిమా, ఒక్కో భాష, ఒక్కో అవకాశంతో నెమ్మదిగా తమ...

శభాష్ సుమతి ఐపీఎస్.. నీ ధైర్యానికి సెల్యూట్

పోలీసింగ్ అంటే కేవలం యూనిఫాం ధరించడం కాదు.. ప్రజల జీవితాల్లో ఉన్న అసలైన సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కారం చూపించే బాధ్యత కూడా. ఆ బాధ్యతను తన ధైర్యంతో, నిబద్ధతతో మరోసారి...

“వారణాసి”లో రామాయణం స్పర్శ… రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు

దర్శకధీరుడు S. S. Rajamouli తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి పై మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో దాదాపు 20 నిమిషాల పాటు Ramayana నుంచి ప్రేరణ పొందిన...

“అమరావతి సచివాలయం గ్లాస్ ఖర్చుపై నిజం ఏమిటి?”

అమరావతి సచివాలయం భవనాల నిర్మాణంలో గ్లాస్ కోసం రూ.2540 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అధికార వర్గాలు మరియు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఈ ఆరోపణలు...