ప్రస్తుతం దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్నది. లాక్ డౌన్ చేయడంతో ఎక్కడి ప్రజలు అక్కడే ఆగిపోయారు. ఎవరూ కూడా బయటకు రావడం లేదు. చాలామంది ఉద్యోగాలు పక్కన పెట్టి ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. చిన్న చిన్న షాపులు సైతం మూతపడ్డాయి. ఎక్కడ వ్యాపారం అక్కడే నిలిచిపోయింది. తినడానికే ఇబ్బందులు పడుతున్నారు. ఇక బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు కట్టాలి అంటే ఎక్కడి నుంచి కడతారు.
ఇప్పటికే కేంద్ర ఆర్ధిక శాఖ పేదలకోసం భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించింది. పేదలు మూడు నెలలపాటు సర్వైవ్ అయ్యేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ఆర్బీఐ కూడా ఈరోజు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. రేపో, రివర్స్ రేపో రేట్లు తగ్గించింది. దీంతో పాటుగా సామాన్య ప్రజలు, చిన్న చిన్న వ్యాపారులు తీసుకున్న రుణాలపై కూడా ఆర్బీఐ ఓ నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల రుణాలపై మూడు నెలలపాటు మారటోరియం ప్రకటించింది. మూడు నెలల పాటు బ్యాంకులకు సంబంధించిన ఈఎంఐ లు కట్టవలసిన అవసరం లేదని ప్రకటించారు.
అయితే, మూడు నెలల తరువాత తిరిగి చెల్లించే సమయంలో వడ్డీ ఎలా ఉండబోతుంది. మూడు నెలల వడ్డీని వినియోగాదారులే కడతారా లేదంటే ప్రభుత్వం చెల్లిస్తుందా అన్నది తెలియాల్సి ఉన్నది. ఆర్బిఐ నుంచి వచ్చే గైడ్ లైన్స్ ను అనుసరించి వడ్డీ రేట్లు, ఈఎంఐ ల మారటోరియం ఉండబోతుంది. ఏదైతేనేం ఈ సమయంలో ఈఎంఐ లు మూడు నెలలపాటు వాయిదా పడటం సామాన్యుడికి భారీ ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవాలి.
869023 787267I discovered your weblog post web web site on the search engines and appearance several of your early posts. Always preserve the top notch operate. I additional the Feed to my MSN News Reader. Seeking forward to reading much more on your part down the line! 630731
849610 720271Aw, it was a really good post. In concept I should put in writing similar to this in addition – spending time and actual effort to manufacture a outstanding article but exactly what do I say I procrastinate alot and no indicates uncover a approach to go carried out. 981730