అడవిలో 10 కిలోమీటర్లు నడిచే పిల్లలకు రోడ్డు: అసలు విషయం ఇది!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,031FansLike
57,764FollowersFollow

విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం దారపతి పంచాయతీ పరిధిలోని రాయపాలెం గ్రామానికి చెందిన గిరిజన చిన్నారులు ప్రతిరోజూ అడవుల మధ్యగా సుమారు 10 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్తున్నారు. సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో చిన్న వయసులోనే ప్రమాదాలతో పోరాడుతూ విద్యను కొనసాగిస్తున్నారు. “మా భవిష్యత్ మీ చేతుల్లో ఉంది” అంటూ వారు ఉప ముఖ్యమంత్రి పవన్  కల్యాణ్‌కు విజ్ఞప్తి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాయపాలెం, పల్లపదుంగడ గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా రహదారి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో దబ్బగుంట నుండి పల్లపదుంగడ వరకు 6.5 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) కింద రూ.4.89 కోట్ల నిధులను పవన్  కల్యాణ్ ఇప్పటికే మంజూరు చేయించారు. ఈ రహదారి మొత్తం 4.36 హెక్టార్ల రిజర్వ్ అటవీ ప్రాంతం గుండా వెళ్తుండటంతో కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ నుండి తొలి దశ అనుమతులు పొందారు. ప్రస్తుతం అటవీ భూమి వినియోగానికి ప్రతిగా ప్రభుత్వం భూమిని ఇచ్చే అఫారెస్టేషన్ ప్రక్రియకు సంబంధించిన రెండో దశ అనుమతి వచ్చే 10 రోజుల్లో పూర్తికానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

అనుమతుల ప్రక్రియ పూర్తయిన వెంటనే రహదారి నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే రాయపాలెం (19 మంది జనాభా), పల్లపదుంగడ (282), అలాగే పరోక్షంగా దారపతి (122), కురిడి (214), పొర్లూ (125) గ్రామాలకు చెందిన మొత్తం 762 మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, గర్భిణీలు, వృద్ధులు అత్యవసర సేవలు పొందేందుకు సులభ మార్గం ఏర్పడనుంది.

ప్రస్తుతం వర్షాకాలంలో ఈ ప్రాంతం పూర్తిగా మట్టిగుంటలుగా మారిపోతుండటంతో రవాణా వ్యవస్థ నిలిచిపోతుంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను మోసుకెళ్లాల్సిన దుస్థితి ఉంది. ఈ రహదారి పూర్తయితే గిరిజన గ్రామాల అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని స్థానికులు ఆశిస్తున్నారు. రాయపాలెం గిరిజన పిల్లల విజ్ఞప్తి ప్రభుత్వం దృష్టిని ఆకర్షించగా, పనులు త్వరితగతిన పూర్తి కావాలన్న ఆకాంక్ష గ్రామస్తుల్లో కనిపిస్తోంది. దీనికి పవన్ కళ్యాణ్ కృషి బాసటగా నిలవనుంది.

సినిమా

Venu Udugula: ‘కుటుంబ పరువు ఏమైపోవాలి..’ మంగ్లీ కేసుపై దర్శకుడు వేణు...

Venu Udugula: ప్రముఖ సినీ గాయకురాలు మంగ్లీపై వచ్చిన ఆర్ధిక లావాదేవీల ఆరోపణలు చిత్రసీమలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంలో సంబంధం...

నాగార్జున 100వ చిత్రం ‘లాటరీ కింగ్’.. దసరాకు గ్రాండ్ రిలీజ్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన 100వ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ ఖరారైనట్టు సమాచారం....

‘తొలిప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ రీ-ఎంట్రీ.. బెల్లంకొండ గణేష్‌తో కొత్త సినిమా!

తొలిప్రేమ వంటి క్లాసిక్ ప్రేమకథతో దర్శకుడిగా గుర్తింపు పొందిన కరుణాకరన్ మళ్లీ టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు కొత్త...

అలీ బాలీవుడ్ ఎంట్రీ.. ‘దాదీ కి షాదీ’లో కీలక పాత్ర!

తెలుగు ప్రముఖ కమెడియన్ అలీ బాలీవుడ్‌లో ఆసక్తికర ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కపిల్ శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న దాదీ కి షాదీ చిత్రంలో అలీ కీలక...

Anudeep: అనుదీప్ పై ఆగ్రహజ్వాలలు.. రంగంలోకి రామ్ చరణ్ ఫ్యాన్స్, జనసేన...

Anudeep: మారుతున్న కాలాన్ని బట్టి కామెడీ పద్దతులు కూడా మారిపోతున్నాయి. సున్నిత హాస్యంతో ప్రజల్ని నవ్వించే రోజుల నుంచి ఎదుటి వ్యక్తుల్ని వ్యక్తిత్వహననం చేస్తూనో, వారి...

రాజకీయం

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

వైఎస్‌ డెత్ మిస్టరీ మళ్లీ హాట్ టాపిక్..! బాణం జగన్ వైపేనా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఈ ఘటనను గత 15 ఏళ్లుగా రాజకీయంగా వాడుకున్న తీరు ఇప్పుడు తిరిగి అదే...

పులివెందులకు గుడ్ బై.? ‘మావిగన్’ నుంచి పోటీ చేయనున్న జగన్.?

రాయలసీమపై వైఎస్సార్సీపీ ఆశలు వదిలేసుకుందా.? పులివెందుల నుంచి వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ పోటీ చేయడంలేదా.? వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘మావిగన్’ నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారా.? ‘మావిగన్’...

ఎక్కువ చదివినవి

“‘రియాలిటీ’తో రాబోతున్న కిరణ్ అబ్బవరం… కొత్త కాన్సెప్ట్ సిగ్నల్?”

యువ హీరో కిరణ్ అబ్బవరం తన తదుపరి ప్రాజెక్ట్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు ‘రియాలిటీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు తెలిసింది. టైటిల్ వినగానే సినిమా కథపై...

సీఆర్డీఏ మ్యాప్ చూస్తే చంద్రబాబు విజన్ అర్థమవుతుంది: పట్టాభి

మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. అమరావతి, సీఆర్డీఏ పరిధి,...

కార్లు.. పెళ్ళాలు.. అన్నప్పుడు మహిళలపై మీ గౌరవం ఏమయ్యింది ..?

ఓ మీడియా సంస్థ అధినేత, ’వీకెండ్ కామెంట్‘ అంటూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, వైసీపీ శ్రేణులు ఆ మీడియా సంస్థపై దాడికి వెళ్ళాయి.. అదీ, తెలంగాణలోని హైద్రాబాద్‌లో...

మావిగన్ దెబ్బ.. రాయలసీమలో వైసీపీకి నష్టం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో “మావిగన్” ప్రతిపాదన కొత్త చర్చకు దారితీసింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ కొత్త రాజధాని ఆలోచనపై రాజకీయ విశ్లేషకులు, పార్టీ అంతర్గత వర్గాల్లో విభిన్న...

Trisha: ‘ప్రేమ’పై త్రిష కామెంట్.. హాట్ టాపిక్ గా మారిన పోస్ట్

Trisha: దక్షిణాది స్టార్ హీరోయిన్ గా దశాబ్దాలుగా కొనసాగుతున్నారు త్రిష. తెలుగు, తమిళంలో కొన్నాళ్లు నెంబర్ వన్ గానూ కొనసాగారు. అయితే, సినిమాలకు అతీతంగా ఆమె చుట్టూ అనేక వివాదాలూ ఉంటూనే ఉంటాయి....