రవితేజ ‘మాస్ జాతర’ నుంచి రెండవ పాట ‘ఓలే ఓలే’ విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,371FansLike
57,764FollowersFollow

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’ నుంచి రెండవ పాట ‘ఓలే ఓలే’ విడుదలైంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ మరియు మొదటి పాట ‘తు మేరా లవర్’కి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన ‘ఓలే ఓలే’తో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.

ఈ పాటలో రవితేజ-శ్రీలీల జోడి మరోసారి ఎమోషన్, ఎనర్జీతో ఆకట్టుకున్నారు. రవితేజ తన వింటేజ్ మాస్ స్టెప్పులతో అలరించగా, శ్రీలీల తన డాన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇద్దరి జోడి తెరపై తెచ్చిన ఉత్సాహం పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది.

భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ పాటకు ప్రత్యేక శక్తినిచ్చింది. రోహిణి సోరట్ గాత్రం పాటను మరింత ఉత్సాహభరితంగా మార్చగా, భాస్కర్ యాదవ్ దాసరి రాసిన సాహిత్యం మాస్ ఫీలింగ్‌ని పండించింది.

దర్శకుడు భాను భోగవరపు మాస్ రాజా అభిమానులను థియేటర్లలో పండగ వాతావరణం సృష్టించేలా ఈ చిత్రాన్ని మలుస్తున్నారని సినిమా యూనిట్ చెబుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

‘మాస్ జాతర’ ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాట విడుదలతో మాస్ రాజా ఫ్యాన్స్‌కి మాస్ జాతర పండగ మూడ్ మొదలైందని చెప్పొచ్చు.

సినిమా

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

DeviSri-Mythri: దేవిశ్రీ-మైత్రి మధ్య దూరం..! నెట్టింట చర్చ

DeviSri-Mythri: సినిమా విజయానికి సంగీతం ఎంతో కీలకం. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం లాంటివి. ఒక సినిమా విడుదలకు ముందే...

రాజకీయం

జనాభా తగ్గుదలపై అప్రమత్తమైన ఏపీ… ‘పాపులేషన్ కేర్’ కొత్త విధానం

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్మాణంలో వేగంగా జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర జనాభా నిర్వహణ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టిన విధానాల నుంచి...

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

ఎక్కువ చదివినవి

తనూజపై ఆరోపణలు… గట్టిగా స్పందించిన బిగ్ బాస్ రన్నరప్

బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ తనూజ మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేస్తుండగా, నటుడు పవన్ సాయి విడాకుల వ్యవహారాన్ని ఆమెతో లింక్ చేస్తూ కొన్ని విమర్శలు...

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

చంద్ర గ్రహణం 2026: మీ రాశిపై ప్రభావం ఎంత? ఏ రంగు బట్టలు మంచివి?

మార్చి 3, 2026 సాయంత్రం జరగబోయే చంద్ర గ్రహణం అనేక రాశులపై ప్రభావం చూపే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. చంద్ర గ్రహణం సాధారణంగా మన భావోద్వేగాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ...

హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభం: మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య సంఘర్షణను తగ్గించడమే లక్ష్యం – పవన్ కళ్యాణ్

మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య పెరుగుతున్న సంఘర్షణలను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘హనుమాన్’ పేరుతో ప్రత్యేక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,...

ఉత్తరాంధ్రలో రూ.2,300 కోట్ల ఫార్మా దిగ్గజం

అమరావతి: ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడుతోంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సెజ్‌లో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు...