మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది ఆరంభంలో క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్ తో వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమాను చేయడం జరిగింది. ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే కొత్త దర్శకుడు శరత్ తో ఒక సినిమాను రవితేజ ప్రకటించాడు. మరో వైపు త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమాను కూడా కమిట్ అయ్యి ఉన్నాడు. ఇవి కాకుండా మరో సినిమాకు కూడా ఆయన ఓకే చెప్పాడట.
మంచు లక్ష్మితో ‘దొంగాట’ చిత్రాన్ని తెరకెక్కించిన వంశీ కృష్ణ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమాను చేయబోతున్నాడట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. పీపుల్స్ మీడియా వారు ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెళ్లడి అయ్యే అవకాశం ఉంది. ఖిలాడీ సినిమాను ఈ ఏడాది విడుదల చేయబోతున్న రవితేజ మరో సినిమాను కూడా ఈ ఏడాది చివరి వరకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
150257 283095I admire the useful facts you offer inside your articles. I will bookmark your weblog and also have my children verify up here often. Im very sure theyll learn lots of new issues right here than anybody else! 389019