టీం ఇండియా చీఫ్ కోచ్ పదవికి గాను రవిశాస్త్రి గుడ్ బై చెప్పడం ఖాయం అంటూ తేలిపోయింది. ఆయన ఇప్పటికే బీసీసీఐ కి తెలియజేశాడని.. ఆయన స్థానంలో ద్రవిడ్ ఎంపిక లాంచనమే అంటూ క్రీడా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలో జరుగబోతున్న టీ20 ప్రపంచ కప్ సిరీస్ తర్వాత రవిశాస్త్రీ తన పదవికి గుడ్ బై చెప్పడం కన్ఫర్మ్ అయ్యింది.
భారత క్రికెట్ జట్టుకు సంబంధించిన కోచింగ్ బృందంలో పలు మార్పులు చేర్పులు ఉంటాయని ఇప్పటికే తెలుస్తోంది. రవిశాస్త్రీ 59 ఏళ్లు పూర్తి అయ్యాయి. టీమ్ ఇండియా కోచ్ వయో పరిమితి 60 ఏళ్ల వరకు మాత్రమే. కనుక ద్రవిడ్ ను ఆస్థానంలోకి ఎంపిక చేసేలా చర్యలు జరుగుతున్నాయి. ఇటీవల శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా జట్టుకు ద్రవిడ్ కోచ్ గా వ్యవహరించాడు. కనుక మెయిన్ టీమ్ కు కూడా ఆయన కోచ్ గా కొనసాగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.