నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండియన సినీ ఇండస్ట్రీగా మారింది. కేవలం సౌత్లోనే కాకుండా, అమ్మడికి నార్త్లోనూ అదిరిపోయే క్రేజ్ క్రియేట్ కావడంతో ఆమె ఏం చేసినా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇటీవల ఆమ మాల్దీవుల్లో వెకేషన్కు వెళ్లగా, ఆమెతో పాటు విజయ్ దేవరకొండ కూడా వెళ్లినట్లుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. ఇక ఓ వీడియోలో విజయ్ వాయిస్ కూడా వినిపించిందని ఈ ట్రోలింగ్ను నెక్ట్స్ లెవెల్కు తీసుకెళ్లారు.
అయితే తాజాగా ఇలాంటి పలు రూమర్స్పై రష్మిక స్పందించింది. తన గురించి ఎలాంటి ట్రోలింగ్ చేసినా తాను పట్టించుకోనని.. తన తల్లి తనకు ఈ విధంగా ఉండాలని చిన్నతనంలోనే ధైర్యాన్ని ఇచ్చిందని రష్మిక చెప్పుకొచ్చింది. ఆమె స్కూల్లో చదివేటప్పుడే తనను ర్యాగింగ్ చేసేవావరని.. అయినా కూడా ఎలాంటి భయం లేకుండా తాను ముందుకు సాగానని రష్మిక పేర్కొంది. అయితే తనను స్కూల్లో ఒంటరిదాన్ని చేసి, తనతోటి విద్యార్ధులు అందరూ ఆమెపై నెగెటివ్ కామెంట్స్ చేయడం ఒక్కోసారి మితిమీరిపోయేదని.. ఆ సమయంలో తాను ఒంటరిగా కూర్చుని వెక్కివెక్కి ఏడ్చేదాన్ని అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.
ఇక ఇప్పుడు తాను రంగులప్రపంచంలో తన కెరీర్ను ముందుకు తీసుకెళ్తుండగా, తనకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయని.. అయినా తాను వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లడమే తనకు మంచిదని తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది. ఏదేమైనా రష్మిక తనపై ట్రోలింగ్స్ చేస్తున్నవారికి గట్టిగానే రెస్పాన్స్ ఇచ్చిందని ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
29005 202707This is a terrific web site, could you be interested in doing an interview about just how you created it? If so e-mail me! 436863