కరోనా కారణంగా ఒక వైపు ప్రభుత్వాలు ఒక్క చోట జనాలు గుమ్మి కూడవద్దంటూ నెత్తి నోరు బాదుకుని చెబుతూ ఉంటే కొందరు మాత్రం బాధ్యతరాహిత్యంతో ప్రవర్తిస్తున్నారు. జనాలను ఒక్క చోట గుమ్మిగూడేలా చేయడంతో పాటు జనాలను ఇంకా పోగు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై నెటిజన్స్ జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్పై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చాలా నీతి సూత్రలు చెప్పే రష్మీ ఇలా ప్రవర్తించడం ఏంటీ అంటూ విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఆమె క్షమాపణ చెప్పాలి వచ్చింది.
అసలు విషయం ఏంటీ అంటే నిన్న రష్మీ రాజమండ్రిలో ఒక షాపింగ్మాల్ ఓపెనింగ్కు వెళ్లింది. కరోనా ఉదృతంగా వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో షాపింగ్ మాల్స్ వంటివి బంద్ చేయాలంటూ ప్రభుత్వాలు పిలుపునిస్తుంటే ఈమె మాత్రం ఏకంగా ప్రారంభోత్సవంకు వెళ్లింది. సరే వెళ్లింది అనుకుంటే అక్కడ ఉన్న వారిని భారీగా పోగు చేసేందుకు సోషల్ మీడియాలో పిలుపునిచ్చింది. నేను రాజమండ్రి వస్తున్నాను. మీరు ఆ మాల్ వద్దకు రమ్మంటూ పోస్ట్ పెట్టింది.
రష్మీ పోస్ట్తో వేలాది మంది అక్కడకు వచ్చారు. దాంతో పోలీసులు అక్కడకు చేరుకుని అందరిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ విషయమై ఆమెను తీవ్రంగా విమర్శించిన నేపథ్యంలో కరోనా కారణంగా ఎవరు రాకపోవచ్చు అనుకున్నాను. కాని ఓపెనింగ్స్కు అంత మంది వస్తారని తాను గెస్ చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది. తన తప్పును తెలుసుకుని క్షమాపణ చెప్పిన రష్మి కరోన గురించి మళ్లీ మాట్లాడే అర్హత కోల్పోయింది అంటూ నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.
858065 708872There is noticeably a bundle to find out about this. I assume you produced sure good factors in options also. 866876
953460 276506Hello there, I discovered your weblog by way of Google at the same time as searching for a comparable subject, your site got here up, it seems to be wonderful. Ive bookmarked it in my google bookmarks. 742173
519068 659644You produced some decent points there. I looked on-line to the concern and discovered most individuals will go along with along together with your internet web site. 984929