రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత సక్సెస్ ను కొనసాగించలేకపోయాడు. సాహో చిత్రంతో మరో ప్యాన్ ఇండియా స్థాయి సినిమాను అందించగలిగాడు కానీ ఆ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఇక సాహో తర్వాత ప్రభాస్ పూర్తి స్థాయి ప్రేమకథలోకి మారిపోయాడు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ప్రభాస్ నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు రాధే శ్యామ్ లేదా ఓ డియర్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం ప్రకారం ఇందులో రానా కూడా నటించబోతున్నాడట. వీరిద్దరూ కలిసి బాహుబలి చిత్రానికి మెయిన్ పిల్లర్స్ గా నిలిచిన విషయం తెల్సిందే. బాహుబలి పాత్ర అంతలా ఎలివేట్ అవ్వడానికి కారణం అవతల వైపు భల్లాలదేవుని పాత్ర సమఉజ్జీగా సవాల్ విసరడం వల్లే. భల్లాలదేవ పాత్రకు ప్రాణం పోసాడు. వీరిద్దరి కెమిస్ట్రీ బాహుబలి చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది.
ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు అనే వార్త ప్రభాస్ అభిమానులను అలరిస్తోంది. అయితే ఈ చిత్రంలో రానా పోషించబోయేది రెండు లేదా మూడు నిమిషాల నిండివున్న కామియో పాత్ర మాత్రమేనని సమాచారం. మరి అది ఎలాంటి పాత్ర అన్నదానిపై ఇంతవరకూ క్లారిటీ లేదు.