గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన అవకాశం దక్కింది. ఇప్పటికే చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న రామ్ చరణ్.. తాజాగా ప్రముఖ రిలయన్స్ కంపెనీ స్థాపించిన కాంపా కోలా కూల్ డ్రింక్ కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ సోషల్ మీడియాలో ప్రకటించింది.
ఈ డ్రింక్ కోసం రామ్ చరణ్ చేసిన యాడ్ వీడియోను కూడా పంచుకుంది. ఎనర్జి రావాలంటే కాంపాకోలా తాగాల్సిందే అన్న కోణంలో ఈ యాడ్ వీడియోను రూపొందించారు. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అవుతోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఇండియాలో కాంపా కోలాను 2023లో లాంచ్ చేసింది కంపెనీ. ఈ సంస్థకు మొదటి బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్ వ్యవహరించడంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఆయన గడిపేస్తున్నారు. ఇప్పుడు యాడ్ వీడియోను కూడా పెద్ది సినిమా లుక్ లోనే చేశారు రామ్ చరణ్. ఆయన చేసిన ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.
