కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయం కట్టడం కు యునెస్కో గుర్తింపు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా 2020 సంవత్సరానికి గాను చైనాలో నిర్వహించిన ప్రపంచ హెరిటేజ్ కమిటీ సమావేశంలో ప్రపపంచ వ్యాప్తంగా 42 అత్యంత పురాతన కట్టడాలను గుర్తించి వాటికి హెరిటేజ్ వారసత్వ సంపదగా గుర్తింపును ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఏ కట్టడంకు కూడా వారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కలేదు.
ములుగు జిల్లా క్రీశ 1213 లో నిర్మితం అయిన ఈ అపురూప కట్టడంకు ఇప్పటికే పలు గుర్తింపులు దక్కాయి. ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వేల కట్టడాలతో పోటీ పడి నిలవడం అంటే మామూలు విషయం కాదు. ఇది కేవలం వరంగల్ వారు గర్వించదగ్గ విషయం కాదని తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు గర్వించదగ్గ విషయం. ఈ కట్టడంను శిల్పి రామప్ప నిర్మిచడం వల్ల కాకతీయులు ఈ కట్టడంకు రామప్ప కట్టడంగా గుర్తింపు ఇచ్చారంటూ చరిత్ర చెబుతోంది.
142149 286012Music began playing any time I opened this web site, so frustrating! 633694