ప్రస్తుతం సినిమాల్లో రీమిక్స్ ట్రెండ్ బాగా ఎక్కువైంది. పాత సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ ని రీమిక్స్ చేస్తూ .. కొత్త హంగామా క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ బాలీవుడ్ లో ఎక్కువగా ఉంది. ఇప్పటికే పలు ఓల్డ్ సూపర్ హిట్ సాంగ్స్ .. న్యూ ట్రెండ్ తో దుమ్ము దుమారం రేపుతున్నాయి. తాజాగా ఓ ఓల్డ్ సాంగ్ ని రీమిక్స్ చేస్తూ .. ఆ సాంగ్ లో చిందేయడానికి రెడీ అయింది టాలీవుడ్ గ్లామర్ భామ రకుల్ ప్రీత్ సింగ్.
ఆ వివరాల్లోకి వెళితే .. 1988 లో హిందీలో వచ్చిన దయవన్ సినిమాలో ”చాహే మేరీ జాను .. తూ ..” అంటూ ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ లో అప్పట్లో సౌత్ గ్లామర్ స్టార్ రమ్యకృష్ణ చిందులు వేసి .. ఆ పాటకు మరింత క్రేజ్ తెచ్చింది. ఇప్పుడు అదే సాంగ్ ని రీమిక్స్ చేస్తూ మార్జావ అనే సినిమాలో పెట్టబోతున్నారు. ఈ సాంగ్ లో రమ్యకృష్ణ ప్లేస్ లో చిందులు వేయడానికి రెడీ అయింది అందాల రకుల్. మరి అప్పట్లోనే రమ్యకృష్ణ హాట్ హాట్ అందాలతో కిక్కెక్కించింది. మరి ఆమె సాంగ్ లో రకుల్ ఆమెను మించేలా హాట్ గా చిందులు వేస్తుందని టాక్. అన్నట్టు ఈ సాంగ్ కోసం ఈ అమ్మడు భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట.
Also Read: బీచ్ బికినీలో రకుల్ .. రచ్చ రచ్చ ?
ఈ మద్యే బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి విజయాన్ని అందుకున్న రకుల్ ఫోకస్ ఇప్పుడు బాలీవుడ్ పైనే ఉంది. ఇప్పటికే అక్కడ అవకాశాలు పట్టేయడానికి ఎక్కువగా ముంబై లోనే మకాం వేసింది. హీరోయిన్ గానే కాదు ఇలా స్పెషల్ ఐటెం సాంగ్స్ కి కూడా ఓకే చెప్పేస్తూ ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకునే పనిలో పడింది రకుల్.
