Switch to English

వైసీపీలో ‘రాజ్యసభ’ కుదుపు: మళ్ళీ పదవులు వాళ్ళకేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

మొత్తం నాలుగు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అతి త్వరలో. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ కూడా రావడంతో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ‘చిన్నపాటి సునామీ’ తలెత్తినట్లే ప్రచారం జరుగుతోంది. ఆశావహులు ఎక్కువ.. అవకాశాలు తక్కువ.. అన్నప్పుడు పరిస్థితి ఇలాగే వుంటుంది మరి. ప్రస్తుతం వైసీపీ నుంచి ఇద్దరు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

తాజాగా, మరో నలుగురికి అవకాశం దక్కనుంది. అయితే, ఆశావహుల లిస్ట్‌ చాంతాడంత వుంది. నాలుగు స్థానాలు, నలభై మందికి పైగా ఆశావహులు.. అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. నలభయ్‌ కాదు.. ఇంకా ఎక్కువేనన్న చర్చ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

శాసన మండలి రద్దు దిశగా ఇప్పటికే వైఎస్‌ జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో తీర్మానం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో, మండలిపై ఆశలు పెట్టుకున్నవారంతా, ఇప్పుడు రాజ్యసభ డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. అలా ఆశావహుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయిందని చెప్పొచ్చు. జిల్లాల వారీగానే ముగ్గురు నుంచి నలుగురి వరకు ఆశావహులు వున్నారంటే, పరిస్థితి తీవ్రతని అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా వుంటే, ‘ఎవరికి రాజ్యసభ సీట్లు ఇవ్వాలో వైఎస్‌ జగన్‌కి బాగా తెలుసు. ఆయన ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారు..’ అంటూ వైసీపీ నుంచి లీకులు అందుతున్నాయి. మరోపక్క, రాజ్యసభ సీటు కోసం.. ఎంత పెద్ద మొత్తంలో అయినా ఖర్చు చేయడానికి ఆశావహులు వెనుకాడరు. ఇది గతంలోనే నిరూపితమయ్యింది.

ఈ నేపథ్యంలో, కనీ వినీ ఎరుగని స్థాయిలో ఇప్పుడు రాజ్యసభ సీటుకి ఆంధ్రప్రదేశ్‌లో డిమాండ్‌ పెరిగిందనడం అతిశయోక్తి కాదేమో. పదవులు తక్కువ.. ఆశావహులు ఎక్కువ కావడంతో.. వైసీపీలో తలెత్తుతున్న ఈ అలజడి ముందు ముందు రాజకీయ సునామీగా మారబోతోందని వైసీపీ నేతలే ఆఫ్‌ ది రికార్డ్‌గా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే పార్టీలో, ప్రభుత్వంలో కీలక పదవులు పొందినవారు.. ప్రత్యేక కారణాలతో రాజ్యసభకు అర్హత సాధించబోతున్నారన్న చర్చ నేపథ్యంలో ‘మళ్ళీ వాళ్ళకేనా పదవులు. ఇలాగైతే, పార్టీలో మేం వుండడం దండగ..‘ అని కొందరు నేతల పార్టీలో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారట.

అన్నట్టు, వైసీపీకి దక్కే నాలుగు సీట్లలో ఓ రాజ్యసభ సీటు విషయమై బీజేపీ ఆశపడుతోంది. ‘వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు..’ అని కొందరు బీజేపీ నేతలు చెబుతున్నా.. ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలు వేరేలా వున్నాయి. అలా బీజేపీకి ఓ రాజ్యసభ సీటు ఇవ్వాల్సి వస్తే.. వైసీపీలో గందరగోళం మరింత తారాస్థాయికి చేరబోతోందన్నది నిర్వివాదాంశం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...