ఉత్తరప్రదేశ్ కు చెందిన రాజ్యసభ ఎంపీ, మాజీ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్ కన్నుమూశారు. కొద్ది కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దీంతో ఆయనకు సింగపూర్ లో చికిత్స చేయిస్తున్నారు. శనివారం ఆయన ఆరోగ్యం క్షిణించడంతో మృతి చెందారు. ఆయన వయసు 64. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2013లో ఆయన కిడ్నీ సంబంధ వ్యాధితో అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స అనంతరం కోలుకుని మళ్లీ జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు.
అమర్ సింగ్ 1956 జనవరి 27న ఉత్తర్ ప్రదేశ్లో జన్మించారు. సమాజ్ వాదీ పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. ములాయం సింగ్తో ఉన్న విబేధాల కారణంగా 2010లో పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఎస్పీ నిర్ణయం తీసుకునే వరకూ పరిస్థితులు వెళ్లాయి. దీంతో 2011లో రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీ స్థాపించారు. 2012లో పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవలేదు.
యూపీఏ1 హయాంలో న్యూక్లియర్ డీల్ సందర్భంగా కాంగ్రెస్ కు సీపీఐ మద్దతు ఉపసంహరించుకుంటే.. సమాజ్ వాదీ పార్టీ మద్దతు ఇచ్చింది. ఇందులో అమర్ సింగ్ పాత్ర ఎంతో ఉంది. సీనియర్ నటి జయప్రదకు అమర్ సింగ్ సన్నిహితులు. ఆమెను యూపీ రాజకీయాలకు పరిచయం చేసారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్కు అమర్ సింగ్కు సన్నిహితుడు. 1996, 2002, 2008, 2016లో నాలుగుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.
678201 976869I gotta favorite this internet website it seems handy . 600588
259867 441212It is difficult to get knowledgeable men and women within this topic, even so, you appear to be guess what happens you are dealing with! Thanks 892629
368431 963347really good post, i surely genuinely like this wonderful site, maintain on it 508091