మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి ఏ.జి.పేరరివాళన్ ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పేరరివాళన్ 31ఏళ్లుగా జైలులో ఉంటున్నాడు. 1991లో రాజీవ్ హత్య అనంతరం జూన్ 11న చెన్నైలో పేరరివాళన్ 19ఏళ్ల వయసులో అరెస్ట్ అయ్యాడు. రాజీవ్ గాంధీ హత్యకు వాడిన పేలుడు పరికరాలను అందించిన కేసులో పేరరివాళన్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 2014లో సుప్రీంకోర్టు పేరరివాళన్ కు జీవిత ఖైదు శిక్ష విధించింది.
2016, 2018లో పేరరివాళన్ విడుదలకు తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదించినా అప్పటి గవర్నర్ తో విబేధాల కారణంగా సాధ్యపడలేదు. తమిళనాడు ప్రభుత్వం పేరరివాళన్ క్షమాభిక్ష దస్త్రాన్ని గతేడాది రాష్ట్రప్రతికి సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టులో అనేక వాదనల అనంతరం ఆర్టికల్ 142 కింద అసాధారణ అధికారాలను ఉపయోగించి పేరరివాళన్ విడుదలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. 1991 మే 21న జరిగిన రాజీవ్ హత్య జరిగింది. ఈ దుర్ఘటనలో రాజీవ్ గాంధీతోపాటు 14 మంది మరణించారు.