సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్ కు దూరంగా ఉంటున్నాడు. అయితే ఈ సమయంలో ఆయన మాత్రం వరుసగా స్క్రిప్ట్లు వింటున్నాడు. ఇప్పటికే రాజశేఖర్ ‘పలాస’ చిత్ర దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు. ఈ సమయంలో మరో సినిమాకు యాంగ్రీ యంగ్మన్ రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జాతీయ అవార్డు గ్రహీత నీలకంఠతో రాజశేఖర్ సినిమా కన్ఫర్మ్ అయ్యిందని సమాచారం అందుతోంది.
షో మరియు మిస్సమ్మ వంటి చిత్రాలతో అవార్డులను దక్కించుకున్న నీలకంఠ 2004 తర్వాత తెలుగులో సినిమా చేసిందే లేదు. ఆయన చేసిన మాయ చిత్రం నిరాశ పర్చడంతో ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్స్ చిన్న హీరోలు ఎవరు ఆసక్తి చూపలేదు. అయితే సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేయడం డబ్బింగ్ సినిమాల విషయంలో తన సహకారం అందించడం వంటివి చేస్తూ వచ్చాడు. ఇప్పుడు రాజశేఖర్ను తన కథతో ఒప్పించాడు.
ఇక రాజశేఖర్ విషయానికి వస్తే గరుడవేగ చిత్రంతో చాలా ఏళ్ల తర్వాత సక్సెస్ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కల్కి సినిమా నిరాశ పర్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజశేఖర్ మీడియం బడ్జెట్ సినిమాలను చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. అందుకే నీలకంఠ మరియు కరుణ కుమార్ల దర్శకత్వంలో రెండు సినిమాలను అయిదు కోట్ల లోపు బడ్జెట్తో చేసే అవకాశం ఉంది.
194465 47865Respect to post author, some fantastic info . 699158
488665 999137I will tell your pals to visit this internet site. .Thanks for the write-up. 677378
638086 499537This will probably be a great web internet site, will you be involved in performing an interview regarding how you developed it? If so e-mail me! 558299