టాలీవుడ్లో కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందని ప్రముఖ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన ‘ముఖచిత్రం’ సినిమాను వీక్షించారు. ‘కలర్ ఫోటో’తో జాతీయ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ‘ముఖచిత్రం’ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయగా, నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
ఈ సినిమా టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో మంచి బజ్ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఇక కలర్ ఫోటో డైరెక్టర్ ఈ సినిమాకు కథను అందిస్తున్నాడని తెలుసుకుని, ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి వీక్షించారు. ఈ సినిమాను ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చిత్ర యూనిట్ తీర్చిదిద్దిందని.. ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడతారని ఆయన చిత్ర యూనిట్ను అభినందించారు.
ఈ సినిమాలో వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాను గంగాధర్ డైరెక్ట్ చేయగా.. ప్రదీప్ యాదవ్, మోహన్ యెల్లా ప్రొడ్యూస్ చేశారు. కాళభైరవ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.
39419 895643You must indulge in a contest for among the greatest blogs over the internet. Ill suggest this web website! 473903
682730 879777I like this web site very much so much great info. 550646