యంగ్ హీరో రాజ్ తరుణ్ త్వరలో ఒరేయ్ బుజ్జిగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాకు విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహించాడు. సమ్మర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. త్వరలోనే ఓటీటీ ద్వారా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. సినిమా విడుదల సందర్బంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ తనకు ఇష్టమైన దర్శకుడు విజయ్ కుమార్ కొండ అన్నాడు. మళ్లీ ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలని కోరుకుంటున్నట్లుగా చెప్పాడు.
అన్నట్లుగానే మరోసారి రాజ్ తరుణ్ ఆ దర్శకుడితోనే సినిమా చేయబోతున్నాడు. ఒరేయ్ బుజ్జిగా సినిమా విడుదల కాకుండానే వీరిద్దరి కాంబోలో మరో సినిమా మొదలైంది. నేడు ఆ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఒరేయ్ బుజ్జి విడుదల అయ్యి హడావుడి తగ్గిన వెంటనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ సినిమా కూడా పూర్తి స్థాయి కామెడీ ఎంటర్ టైనర్ గానే ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.
ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడీగా హిందీ నటి హేమల్ నటించబోతుంది. ఇక తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన పూర్ణ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది. పూర్ణ మొదటి సారి ఇలాంటి పాత్రను చేస్తుంది. వనమాలి క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాను అనంత్ నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 2న విడుదల కాబోతున్న ఒరేయ్ బుజ్జి సినిమా హిట్ అయితే ఖచ్చితంగా వీరిద్దరి తదుపరి సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
27533 452630I came across this very good from you out of sheer luck and never feel lucky enough to say also credit you for any job well done. 716365
512049 994412Dead written articles , Actually enjoyed reading . 730736