అన్నదాతలపై ఏపీలోని జగన్ సర్కారు వరాల జల్లు కురిపించింది. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుభరోసా పథకం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇస్తానన్న హామీ మొత్తానికి అదనంగా రూ.వెయ్యి ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఆ పథకాన్ని నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు పొడిగించింది. రైతుభరోసా పథకంపై సోమవారం జరిపిన సమీక్షలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకం కింద ఏటా రూ.12,500 మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందిస్తామని పేర్కొన్నారు. ఇలా ప్రతి ఏటా అక్టోబర్ లో ఈ మొత్తం విడుదల చేస్తామని, నాలుగేళ్లపాటు ఈ పథకం కొనసాగుతుందని ప్రకటించారు. తాజాగా ఆ మొత్తాన్ని రూ,వెయ్యి పెంచుతూ ఇకపై రూ.13,500 ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా ఐదేళ్లపాటు ఈ పథకం అమలు చేయనున్నట్టు తెలిపారు. రూ.13,500 మొత్తాన్ని ఒకే విడతలో కాకుండా మూడు విడతలుగా ఇవ్వనున్నారు.
ప్రభుత్వం పెట్టుబడిసాయంగా ఇచ్చే మొత్తాన్ని ఒకే విడతలో కాకుండా ఖరీఫ్, రబీ సీజన్ లకు ఉపయోగపడేలా రెండు విడతల్లో ఇవ్వాలని రైతు ప్రతినిధులు విన్నవించగా.. జగన్ దానిని మూడు విడతలుగా మార్చారు. ఖరీఫ్, రబీ సీజన్లతోపాటు సంక్రాంతికి కూడా ఉపయోగపడేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. అవసరమైతే ఓ వెయ్యి రూపాయలు పెంచి సంక్రాంతికి కూడా ఇస్తే బాగుంటుందన్న జగన్ సూచనతో ఈ మేరకు మార్గదర్శకాలు తయారుచేసినట్టు చెప్పారు.
మే నెలలో రూ.7,500, రబీకి ముందు రూ.4వేలు, కుప్ప నూర్చే సంక్రాంతి సమయంలో రూ.2వేలు ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే ఈ పథకానికి వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ సమ్మాన్ గా పేరు మార్చినట్టు వెల్లడించారు. కాగా, రైతు భరోసా పథకాన్ని మంగళవారం నెల్లూరు జిల్లా కాకుటూరులో సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కౌలు రైతులకు కార్డులు పంపిణీ చేయడంతోపాటు పెట్టుబడి చెక్కులను రైతులకు అందజేస్తారు.
935324 623403Sweet internet web site , super style , genuinely clean and utilize genial . 169925
659568 311790You should take part in a contest for among the top blogs on the internet. I will suggest this web internet site! 802517
972260 858526Pretty! This was a really great post. Thank you for your provided info. cool desktop 268424