ఫేస్ బుక్ స్నేహాలు ఎంతటి దారుణంగా ఉంటాయో తెలిపే మరో సంఘటన తాజాగా చోటుచేసుకుంది. ఫేస్ బుక్ లో పరిచయం అయిన యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని రమ్మని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ పని చేసింది ఎవరో పోకిరీలు కాదు.. రైల్వేలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు ఈ దురాగతానికి పాల్పడ్డారు. భోపాల్ మెయిన్ రైల్వేస్టేషన్ లోనే ఈ సంఘటన జరిగింది. భోపాల్ రైల్వే స్టేషన్ లో సెక్యూరిటీ కౌన్సిలర్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఇన్ చార్జిగా ఉన్న రాజేష్ తివారీ (45)కి ఉత్తరప్రదేశ్ మహబ్ కు చెందిన 22 ఏళ్ల యువతితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలో ఆమె ఉద్యోగ ప్రయత్నాల్లో ఉందని తెలుసుకున్న తివారీ.. తాను రైల్వేలో మంచి స్థానంలో ఉన్నందున సులభంగా ఉద్యోగం వేయిస్తానని చెప్పి భోపాల్ రావాలని ఆహ్వానించాడు. ఇది నిజమేనని అనుకున్న సదరు యువతి భోపాల్ రైల్వే స్టేషేన్ కు వచ్చి తివారీని కలిసింది. వెంటనే ఆమె రైల్వేస్టేషన్ తొలి అంతస్తులో ఉన్న గదికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న మరో రైల్వే అధికారితో కలిసి దురాగతానికి పాల్పడ్డాడు. తొలుత తనకు కూల్ డ్రింక్ లో డ్రగ్స్ కలిపి ఇచ్చారని.. అనంతరం ఇద్దరూ తనపై అత్యాచారం చేశారని బాధితురాలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు తివారీని అరెస్టు చేశారు. ‘రాజేశ్ తివారీని అరెస్టు చేశాం. మరో అధికారిని కూడా అదుపులోకి తీసుకున్నాం. బాధితురాలు అతడే నిందితుడు అని నిర్దారిస్తే అతడిని కూడా అరెస్టు చేస్తాం’ అని భోపాల్ రైల్వే పోలీస్ సూపరింటెండెంట్ హితేశ్ చౌదరి తెలిపారు.
809242 10526Some genuinely nice and utilitarian info on this internet site, as effectively I believe the style has got wonderful features. 301026