రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాల ప్రకారం పనితీరు సరిగాలేని రైల్వే ఉద్యోగులపై ఆ శాఖ కొరడా ఝులిపిస్తోంది. 2021 జూలై నుంచి ఇప్పటివరకూ ప్రతి మూడు రోజులకు ఓ ఉద్యోగిపై వేటు పడుతోంది. మొత్తంగా ఇప్పటివరకూ 139 మంది రైల్వే ఉద్యోగులను వీఆర్ కు పంపించగా.. 38 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఈమేరకు ఓ రైల్వే అధికారి వెల్లడించారు. బుధవారం కూడా ఇద్దరు సీనియర్ గ్రేడ్ ఉన్న ఉద్యోగులను వీఆర్ కు పంపించినట్టు తెలుస్తోంది.
ఉద్యోగులు విధుల్లో అలసత్వం వహించినా.. అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలోనే హెచ్చరించారు. ఈక్రమంలోనే ఉద్యోగులకు వీఆర్, తొలగింపు జరిగిందని అధికారులు తెలిపారు. వేటు పడిన ఉద్యోగుల్లో ఎలక్ట్రికల్, సిగ్నలింగ్, మెకానికల్, మెడికల్ స్టోర్స్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో 5లక్షలు, రాంచీలో 3లక్షలు లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు అధికారులకు చిక్కడం ఇందుకు నిదర్శనంగా చెప్పాలి.
Everything is very open with a very clear
description of the challenges. It was really informative.
Your site is very useful. Many thanks for sharing!
You really make it seem so easy with your presentation but I
find this topic to be actually something that I think I would
never understand. It seems too complex and very broad for
me. I am looking forward for your next post, I’ll try to get the hang of it!