ఏపీ సచివాలయ ఉద్యోగులకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మద్దతు తెలిపారు. ‘ఏపీ సచివాలయ ఉద్యోగుల డిమాండ్లలో న్యాయముంది. సచివాలయ ఉద్యోగులకు నా మద్దతు తెలుపుతున్నాను. విజయసాయిరెడ్డి అండమాన్ దీవుల్లో తిరగడం మానేసి ప్రజల కష్టాలు చూడాలి. ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండానే ఆరోగ్యశ్రీ తొలగించారు. సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదు. జగన్ మొద్దునిద్ర వదిలి ఉద్యోగుల ఆందోళనలు పట్టించుకోవాలి. భీమిలి ఎంఆర్వో ఉద్యోగులను బెదిరిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తోంది.
ఈక్రమంలో తన రాజీనామాపై స్పందిస్తూ.. ‘ఫిబ్రవరి 5 వరకూ తనపై అనర్హత పిటిషన్ వేయించడానికి వైసీపీకి అవకాశం ఇస్తున్నాను. అమరావతి కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఎన్నిక వస్తే నేను గెలుస్తాననే నమ్మకం ఉంది.. లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా. నేను గెలిస్తే సీఎం జగన్ రాజీనామా చేయాలి. 13న నర్సాపురం వెళ్తున్నాను. రెండు రోజులు అక్కడే ఉంటాను. రెండు రోజులు పోలీసులు తనకు భద్రత కల్పించాలి’ అని అన్నారు.
174884 100908Hey! I merely wish to give an enormous thumbs up for the excellent information youve got here on this post. I will likely be coming back to your blog for far more soon. 782969
225083 296307Music began playing any time I opened this web site, so frustrating! 112329