Switch to English

బిగ్‌ స్టోరీ: ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ పేరు వెనుక రాజకీయం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటే ఏంటి.? అని గ్రామ స్థాయిలో ఎవర్నన్నా ప్రశ్నిస్తే, ‘రాజశేఖర్‌రెడ్డి పార్టీ’, ‘జగన్‌ పార్టీ’ అని అంటుంటారు. కానీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అసలు పేరు వేరు. ఇది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణలోని నల్గొండ జిల్లాకి చెందిన శివకుమార్‌ అనే వ్యక్తి ఈ పార్టీ పేరుని ఎన్నికల కమిషన్‌ వద్ద రిజిస్టర్‌ చేశారు. ఇక, ‘అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ పేరుతో ఇంకో పార్టీ వుంది. అది కడప జిల్లాకి చెందిన భాషా అనే ఒకప్పటి వైఎస్సార్‌ సన్నిహితుడి పేరుతో రిజిస్టర్‌ అయ్యింది.

ఇంతకీ, ఈ పేర్ల గొడవ ఇప్పుడెందుకు.? అంటే, ఆ స్థాయిలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. వైఎస్సార్సీపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు చుట్టూ పెద్ద రచ్చ జరుగుతున్న విషయం విదితమే. ఆయనకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరుతో విజయసాయిరెడ్డి షోకాజ్‌ నోటీస్‌ ఇవ్వడంతోనే అసలు రగడ షురూ అయ్యింది. ‘అసలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరుతో మీరెలా నోటీస్‌ ఇస్తారు.? మనది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ కదా.!’ అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నిస్తూ ఓ లేఖ విడుదల చేసిన విషయం విదితమే.

కథ ఇక్కడితో ఆగిపోలేదు. ‘అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ వ్యవస్థాపకుడు భాషా మీడియా ముందుకొచ్చారు. షోకాజ్‌ లెటర్‌ విషయమై తాను ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ’కి నోటీసులు ఇస్తానని అంటున్నారాయన. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జీవించి వున్నప్పుడే, ‘అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ ఆలోచనలు జరిగాయనీ, అదంతా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికీ తెలిసిన వ్యవహారమేనని ‘భాషా’ పెద్ద బాంబే పేల్చారు. ఇందులో నిజమెంత.? అన్నది తేలాల్సి వుందనుకోండి.. అది వేరే విషయం. ఇక, సీన్‌లోకి రావాల్సింది ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ’ వ్యవస్థాపకుడు శివకుమార్‌.

అసలు ఈ కథ మొత్తం కేంద్రం ఎన్నికల సంఘం దృష్టికి వెళితే, అట్నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్న విషయమై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అని చెప్పినా.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ అని చెప్పినా ఒకటే.. రఘురామకృష్ణరాజు తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నారుగానీ, ఆయన తప్పటడుగులు వేస్తున్నారు.. ఆయనపై పార్టీ పరంగా చర్యలు తప్పవు..’ అంటూ ఓ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో రఘురామకృష్ణంరాజు వుండగానే వైసీపీ నేత మల్లాది విష్ణు వ్యాఖ్యానించడం గమనార్హం. రఘురామకృష్ణంరాజు మాత్రం, ‘ఎవరెవరో ఏదేదో పనికిమాలిన మాటలు చెబుతుంటారు.. వైఎస్‌ జగన్‌ మాత్రం నన్ను పార్టీలోంచి బయటకు పంపరు..’ అని తేల్చి చెబుతుండడం గమనార్హం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...