అంతన్నాడింతన్నాడే గంగరాజు.. అన్న పాట గుర్తుకొస్తోంది వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా పరిస్థితి చూస్తోంటే. కొండంత రాగం తీసి తుస్సుమనిపించేశారాయన. ఔను మరి, కోర్టుకెళ్ళారు.. ప్రత్యేక హెలికాప్టర్ అన్నారు.. చివరికి రైలులో పయనమైనా, వెంటనే కిందికి దిగేశారు.!
సొంత నియోజకవర్గం వెళ్లడానికి రఘురామకృష్ణరాజు పడరాని పాట్లూ పడాల్సి వస్తోంది. ఓ ఎంపీ, తన సొంత నియోజకవర్గానికి వెళ్ళే పరిస్థితి లేదంటే, అసలు దేశంలో ప్రజాస్వామ్యం వున్నట్టా.? లేనట్టా.? ఓ అధికార పక్షం, తమ పార్టీ లైన్ దాటారనే ఆరోపణతో, రాష్ట్రం నుంచి ఆయన్ని అనధికారికంగా బహిష్కరించిందంటే.. రాష్ట్రంలో ఏ ‘స్వామ్యం’ నడుస్తున్నట్టు.?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రఘురామకృష్ణరాజు అత్యంత సన్నిహితుడట. అందులో కొంత నిజం లేకపోలేదు కూడా. కానీ, రఘురామ సొంత నియోజకవర్గానికి వెళుతూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ, ఆ రఘురామకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని పట్టించుకోకపోతే ఎలా.?
నిజానికి, ప్రధాని నరేంద్ర మోడీకి భీమవరంలో ఘనస్వాగతం పలికే లిస్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా వుండి తీరాలి. కానీ, ఆయనకు ఆ అవకాశమే దక్కలేదు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో రఘురామ పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వమే కుట్ర పన్నిందన్న ఆరోపణలున్నాయి. అదెంతవరకు నిజం.? అన్నది వేరే చర్చ.
ప్రజాస్వామ్యం, ప్రభుత్వం, ప్రోటోకాల్స్, ప్రజా ప్రతినిథి, హక్కులు, ప్రాథమిక హక్కులు.. ఇలాంటివన్నీ ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. అధికారంలో వున్నవారికి ఏది ఇష్టమైతే అదే జరుగుతుంది.. ఇష్టం లేనిది జరగదు.. అనే విషయం ఇంకోసారి నిరూపితమైపోయింది.
చేసుకున్నోడికి చేసుకున్నంత.. అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, ఔను మరి.. ఆయన వైసీపీ నుంచి పోటీ చేశారు.. గెలిచారు.. ఆ పార్టీని ధిక్కరించారు.. ఇంతకన్నా ‘నేరం’ ప్రస్తుత ‘రాజకీయ స్వామ్యం’లో ఇంకేముంటుంది.? నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?
221603 610538Hello there! Nice post! Please inform us when all could see a follow up! 492294