లేటెస్ట్ గా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు పూరి జగన్నాధ్. రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఏకంగా 40 కోట్ల వసూళ్లను రాబట్టి పూరి స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసింది. ప్రస్తుతం రౌడీ హీరోతో సినిమా చేస్తున్నాడు పూరి. నవంబర్ నుండి ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది.
ఇదిలా ఉండగా .. పూరి జగన్నాధ్ .. లేటెస్ట్ గా డార్లింగ్ హీరో ప్రభాస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో బుజ్జిగాడు , ఏక్ నిరంజన్ సినిమాలు వచ్చాయి. తాజాగా హ్యాట్రిక్ సినిమా కోసం అప్పుడే పూరి ప్రయత్నాలు మొదలెట్టాడని తెలుస్తోంది. ఇదివరకే ప్రభాస్ కు ఓ లైన్ కూడా చెప్పాడట. ఆ లైన్ నచ్చడంతోస్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పాడట ప్రభాస్.
ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ ని నేరేట్ చేయాలనీ చూస్తున్నాడు. డార్లింగ్ తనకు ఎప్పుడు టైం ఇస్తాడా అన్న ఆలోచనలో ఉన్నాడు పూరి. లెటస్ట్ గా సాహో సినిమాతో భారీ ప్లాప్ ను అందుకున్న ప్రభాస్ నెక్స్ట్ సినిమాను జిల్ ఫేమ్ రాధా కృష్ణ తో చేస్తున్నాడు. ఒకవేళ పూరి కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే .. స్పీడ్ గా విజయ్ సినిమా పూర్తీ చేసి ప్రభాస్ సినిమా పట్టాలు ఎక్కించే ఆలోచనలో ఉన్నాడు పూరి జగన్నాధ్. చూద్దాం ఏమి జరుగుతుందో.
Also Read: ‘సాహో’ ఎఫెక్ట్: పాపం సుజీత్పై ప్రభాస్ గుస్సా.!
