YS Jagan: పదుల సంఖ్యలో కరడుగట్టిన కార్యకర్తలు.. వందల సంఖ్యలో సాధారణ కార్యకర్తలు.. వీరికి అదనంగా, డబ్బులు ఖర్చు చేసి రప్పించుకున్న జనాలు.! ఇదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభల తీరు.!
గతంలో చంద్రబాబు చేసినా.. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసినా.. సంక్షేమ పథకాల పేరుతోనో, ఇంకో పేరుతోనో అధికారికంగా నిర్వహించే బహిరంగ సభలకు జనాన్ని తరలించడమైతే తప్పదు.! ఇందుకోసం భారీగానే ఖర్చు చేయాల్సి వుంటుంది.
నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఆ పాదయాత్రకి జనం బాగానే వస్తున్నారు.. అంచనాలకు భిన్నంగా. కానీ, పాదయాత్ర వెలవెలబోతున్నట్లుగా వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. చంద్రబాబు సభల విషయంలోనూ అదే తీరు.
అధికార పార్టీకి అడ్వాంటేజ్ వుంటుంది. ప్రజాధనం ఖర్చు చేసి, అధికారాన్ని దుర్వినియోగం చేసి మరీ బహిరంగ సభల్ని నిర్వహిస్తారు.. పెద్ద సంఖ్యలో జనాన్ని రప్పిస్తుంటారు. ‘రాకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తాం..’ అని హెచ్చరించడమూ మామూలే. చంద్రబాబు హయాంలోనూ జరిగిందదే.. జగన్ హయాంలోనూ జరుగుతున్నది అదే.
కాకపోతే, వైఎస్ జగన్ బహిరంగ సభల నుంచి జనం పారిపోతున్నారు. పోలీసులు ఎంతలా వారిని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నా.. గేట్లు దూకేసి మరీ జనం పారిపోతుండడం గమనార్హం. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడే జనం పారిపోతున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
వైనాట్ వన్ సెవెన్టీ ఫైవ్.! విషయం ఇక్కడే అర్థమయిపోతోంది కదా.!